సునంద ఆత్మహత్య కేసు నుంచి శశిథరూర్‌కు విముక్తి..!

కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్‌కు గొప్ప ఊరట లభించింది. ఆయన భారయ సునంత పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో ఇంత కాలం ఆయన కేసును ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఆయనపై నమోదు చేసిన అభియోగాలను ఢిల్లీ కోర్టు కొట్టి వేసింది. 2014వ సంవత్సరం జనవరి 17న శశి థరూర్‌ భార్య సునంద పుష్కర్ ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్‌లో అనుమానాస్పదంగా మృతి చెందారు. హత్య జరిగిందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే దర్యాప్తు జరిపిన పోలీసులు ఆత్మహత్యగా తేల్చారు.

కానీ ఆత్మహత్యకు కారణం శశిథరూర్ అని ఆయనపై పోలీసులు కేసులు పెట్టారు. సునందను శశిధరూర్ టార్చర్ పెట్టారని ఇతరర మహిళలతో సంబంధాలు పెట్టుకున్నారని ఆయన వల్ల మానసిక క్షోభను అనుభవించారని పోలీసులు కోర్టులో వాదించారు. అయితే సునంద ఎలాంటి సూసైడ్ నోట్ రాయలేదు. కోర్టులో శిశిథరూర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలను ప్రవేశ పెట్టలేకపోవడంతో ఢిల్లీ కోర్టు శశిథరూర్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. వర్చువల్ పద్దతిలో కోర్టుకు హాజరైన శశి థరూర్ తీర్పుపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. దాదాపు ఏడున్నర సంవత్సరాలు పడుతోన్న ఈ బాధకు విముక్తి లభించందన్నారు.

శశిథరూర్‌కు సునంతతో మూడో పెళ్లి. ఐక్యరాజ్య సమితిలో ఉన్నత స్థానంలో పని చేసిన శశిథరూర్ తర్వాత ఇండియాకు వచ్చి రాజకీయాల్లో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన కేరళ నుంచి ఎన్నికవుతూ వస్తున్నారు. మంచి ప్రతిభావంతునిగా పేరున్న శశిథరూర్ పై సునంద ఆత్మహత్య ఘటనతో బీజేపీ ఆయనను ఇబ్బంది పెట్టాలని అనుకుందని కాంగ్రెస్ నేతలు గతంలో విమర్శలు చేసేవారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కూటమిదే విజయమని వైసీపీ అభ్యర్థుల బెట్టింగులు..!!

స్వయంగా జగన్ రెడ్డి గతంలో కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని ప్రకటించినా వైసీపీలో ఆ ధీమా ఏమాత్రం కనిపించడం లేదు. ఇప్పటికే బెట్టింగ్ రాయుళ్లు కూటమిదే అధికారమని లక్షల్లో బెట్టింగ్ కాస్తుండగా...వైసీపీ తరఫున...

ఓట్లు ఎలా వస్తాయో అలానే మోదీ ప్రచారం !

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి కాలంలో మతప రమైన అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ వస్తే రామ మందిరాన్ని బుల్డోజర్లతో కూల్చేస్తుందని ప్రచారం చేస్తున్నారు. మోదీ...

మళ్లీ అదే నినాదం ఎత్తుకున్న మోడీ – ఏంటి సీక్రెట్ ..?

కొద్ది రోజులుగా కాంగ్రెస్ పై ఎదురుదాడి చేయడానికి ప్రాధాన్యత ఇచ్చిన ప్రధాని తాజాగా మరోసారి 400సీట్లు అంశాన్ని తెరపైకి తీసుకురావడం ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల్లో బీజేపీ గతం కన్నా ఎక్కువగా సీట్లు...

ఆ విషయంలో మంత్రులు ఫెయిల్..!?

కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ గా ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తిపోస్తున్నా ఒకరిద్దరూ మంత్రులు మినహా మిగతా వారెవరూ పెద్దగా స్పందించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. వీటన్నింటికి రేవంత్ ఒక్కడే కౌంటర్ ఇస్తున్నారు తప్పితే మంత్రివర్గం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close