విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ‌లో చిరు?

చిరంజీవి జోరు మామూలుగా లేదు. సినిమాల మీద సినిమాలు ఓకే చేస్తున్నాడు. కొత్త వాళ్ల‌కి అవ‌కాశాలు ఇస్తున్నాడు. ఒక‌ట్రెండు హిట్లు కొట్టిన వాళ్లకూ… త‌లుపులు తెరిచే ఉంచుతున్నాడు చిరు. తాజాగా… చిరు కోసం ఓ కొత్త క‌థ త‌యారైంది. ఈసారి విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఈ క‌థ‌ని అందించార‌న్న‌ది ఇన్ సైడ్ టాక్‌.

బాహుబ‌లి, భ‌జ‌రంగీ భాయ్ జాన్… ప్ర‌స్తుతం ఆర్‌.ఆర్‌.ఆర్‌ చిత్రాల ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ కి చిరంజీవి అంటే.. వ‌ల్ల‌మాలిన అభిమానం. ఆయ‌న ఎప్ప‌టి నుంచో చిరుతో క‌ల‌సి ప‌ని చేయాల‌నుకుంటున్నార్ట‌. ఇటీవ‌ల విజ‌యేంద్ర ప్ర‌సాద్ చిరంజీవి మ‌ధ్య భేటీ జ‌రిగింది. ఇద్ద‌రూ క‌థ గురించి చర్చించుకున్నార‌ని తెలుస్తోంది. చిరుకి స‌రిప‌డ క‌థ‌.. విజ‌యేంద్ర ప్ర‌సాద్ రాశార‌ని, అందుకోస‌మే ఇద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింద‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల‌.. చిరు పుట్టిన రోజు సంద‌ర్భంగా విజ‌యేంద్ర ప్ర‌సాద్ కొన్ని కామెంట్లు చేశారు. “టాలీవుడ్ లో ఒక‌టి, రెండు, మూడు స్థానాలు చిరంజీవివే. అన్ని రికార్డులూ ఆయ‌న పేరు మీద ఉండాలి. త్వ‌ర‌లో ఆయ‌న సినిమా పాత రికార్డుల‌న్నీ చెరిపేసే స్థాయిలో ఆడాలి. అందుకోసం నా వంతు ప్ర‌య‌త్నం నేను చేస్తా“ అన్నారు. ఈ కామెంట్లు సైతం.. చిరు కోసం ఆయ‌న క‌థ సిద్ధం చేశార‌న్న విష‌యాన్ని బ‌లప‌రుస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎయిర్‌లైన్స్‌ సహా ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ… ప్రధాని సంచలన నిర్ణయం

కొన్నేళ్లుగా ఆర్థిక , రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ ను తిరిగి గాడిన పెట్టేందుకు ఇటీవల ఎన్నికైన కొత్త ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలను అమలు చేయాలని...

వైసీపీ కుట్రలకు వీరనారిలా ఎదురు నిలిచిన మహిళ..!!

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేసింది. వ్యవస్థలను తమ చెప్పు,చేతుల్లో ఉంచుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చిందన్న విమర్శలు మూటగట్టుకుంది. దాంతో ఎన్నికలను కూడా సరైన విధంగా నిర్వహించేందుకు వైసీపీ సహకరిస్తుందా..? అనే...

రంగంలోకి కేజ్రీవాల్… బీజేపీ ఆశలపై నీళ్లు చల్లుతారా..?

మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఇటీవల మధ్యంతర బెయిల్ రావడంతో ఎన్నికల్లో ఆయన ప్రభావం ఎంతమేర ఉంటుందనేది చర్చనీయాంశం అవుతోంది. గతంలో ఢిల్లీలోని లోక్ సభ...

టాలీవుడ్ కి తొలి ప్రమాద హెచ్చరిక

తెలంగాణలో రెండు వారాల పాటు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో షోలు ఆపివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో నష్టం ఎక్కువ వస్తోందని, దీంతో సినిమాల ప్రదర్శనలు ఆపాలని నిర్ణయించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close