కేశినేనివి బెదిరింపులా ? నిజంగానే విరక్తి చెందారా ?

కేశినేని నాని ఇక ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లుగా టీడీపీని వ్యతిరేకించే.. వైసీపీకి దగ్గరగా ఉండే మీడియాలో ప్రచారం జరిగింది. ఆయనే ఈ విషయాన్ని చెప్పినట్లుగా ఆ మీడియా చెప్పుకొచ్చింది. తన ఆశక్తతను చంద్రబాబుకు కూడా వెల్లడించారని చెప్పుకొచ్చారు. అయితే ఆయన తన కుమార్తెను రాజకీయాల్లో ప్రోత్సహించాలనుకుంటున్నారని ఆమె కోసం ఇలా మాట్లాడుతున్నారన్న అభిప్రాయం వినిపించింది. అయితే దానికి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. తన కుమార్తె కూడా ఇక రాజకీయాల్లో ఉండదని స్పష్టం చేశారట.

కేశినేని నాని కుమార్తె శ్వేత విజయవాడ మేయర్ అభ్యర్థిగా కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ పడ్డారు. ఆమె కార్పొరేటర్‌గా గెలిచినా టీడీపీ మాత్రం ఓడిపోయింది. ఆ తర్వతా శ్వేత కూడా కొంత కాలంగా రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు. ఆమె గతంలో టాటా ట్రస్ట్‌లో కీలకంగా పని చేసేవారు. మళ్లీ టాటా ట్రస్ట్‌లోనే పనిచేసేందుకు వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. అందుకే ఆమె కూడా పోటీ చేయదని చెబుతున్నారు. టాటా ట్రస్ట్ ఆమె ద్వారానే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా సేవా కార్యక్రమాలు చేపట్టింది.

కేశినేని నాని ముక్కుసూటిగా మాట్లాడే రాజకీయ నేతగా పేరు ఉంది. ఆయనకు ఇటీవలి కాలంలో బెజవాడ టీడీపీ నేతలతో సరిపడటం లేదు. వర్గపోరాటం ఎక్కువ అయింది. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో కూడా ఇది బయటపడింది. అయితే అప్పట్లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మాట్లాడి పరిస్థితుల్ని సర్దుబాటు చేశారు. ఈ కారణంగా పార్టీలో ప్రాధాన్యం కోసం ఇలా చేస్తున్నారా లేకపోతే నిజంగానే పోటీ రాజకీయాల నుంచి వైదొలుగుతారా అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

మోనిఫెస్టో మోసాలు : కొత్తది సరే పాతదాంట్లో ఎగ్గొట్టిన వాటికి సమాధానం చెప్పాలి కదా !

వైసీపీ చీఫ్ జగన్ కొత్త మేనిఫెస్టో విడుదల చేశారు. పాత దాంట్లో అమలు చేయనివి తీసేసి కొత్తగా ప్రింట్ చేసి ఇచ్చారు. కాస్త డబ్బులు ఎక్కువ ఇస్తానని ఆశ పెట్టే ప్రయత్నం...

పిఠాపురంలో పవన్‌పై పుకార్ల కుట్రలు !

పవన్ కల్యాణ్ గెలిస్తే అసెంబ్లీలో అడుగుపెడితే తాము చూస్తూ బతకలేమని చస్తూ బతకాలని అనుకుంటున్నారేమో కానీ వైసీపీ నేతలు ప్రతి అడ్డమైన వ్యూహాన్ని పాటిస్తున్నారు. రాత్రికి రాత్రి పిఠాపురం వర్మ వైసీపీలోకి...

ఆర్కే పలుకు : జగన్‌ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కూ ఉంది !

జగన్ ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కు ఉందా ?. ముందు తెలంగాణలో పార్లమెంట్ సీట్లను గెలిపించుకోవాల్సిన అవసరం మాత్రం రేవంత్ కు ఉంది. అందుకే ఆయన కిందా మీదా పడుతున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close