సూపర్ రిచ్ బీజేపీ.. ఆస్తులు రూ. ఐదు వేల కోట్లు !

దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు కలిపి స్థిరాస్తులు దాదాపుగా రూ. ఏడు వేల కోట్లు ఉంటాయని ఏడీఆర్ అనే సంస్థ అధికారిక డాక్యుమెంట్లు.. ఆయా పార్టీలు ఇచ్చిన సమాచారం ఆధారంగా లెక్కించింది. ఈ ఏడు వేల కోట్లలో ఒక్క బీజేపీకే రూ. ఐదు వేల కోట్ల వరకూ ఉన్నాయి. మిగిలిన రెండు వేల కోట్లు అన్ని రాజకీయ పార్టీల ఆస్తులు. దేశాన్ని స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సుదీర్ఘంగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఆ పార్టీ పెద్దగా ఆస్తులు పోగేసుకోలేదు. బీఎస్పీ కన్నా తక్కువ ఆస్తులే ఆ పార్టీకి ఉన్నాయి.

బీజేపీకి స్థిరాస్తులు రూ. 4847 కోట్లుఉన్నాయి. దేశంలో మరే జాతీయ ప్రాంతీయ రాజకీయ పార్టీకి కనీసం రూ. వెయ్యి కోట్ల స్థిరాస్తులు లేవు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న స్థిరాస్తులు కేవలం రూ. 588 కోట్లు మాత్రమే. కాంగ్రెస్‌ కన్నా బీఎస్పీకి ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. రూ.698 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీల్లో సమాజ్ వాదీ పార్టీకి రూ . 563 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉండగా.. రెండో స్థానంలో ఉన్న టీఆర్ఎస్‌కు రూ. 301 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో అన్నాడీఎంకే, టీడీపీ ఉన్నాయి.

దేశంలో విరాళాల్లో అయినా ఆస్తుల్లో అయినా బీజేపికి సరితూగే పార్టీ లేదు. ఆస్తులు మాత్రమే కాదు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి ప్రతి ఏడాది వందల కోట్లలో విరాళాలు వస్తూ ఉంటాయి. కొసమెరుపేమిటంటే ఇప్పుడు కూడా ఆ పార్టీ కార్యకర్తల నుంచి విరాళాల సేకరణ చేస్తోంది. పార్టీ బలోపేతం కోసం ఎంతో కొంత విరాళం ఇవ్వాలని ప్రజల్ని కోరుతూ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఎంత ఆస్తి.. ఆదాయం ఉన్నా.. బీజేపీకి సరిపోవడం లేదేమో ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తిట్లు,విధ్వంసం, రౌడీయిజానికా పాజిటివ్ ఓటు సజ్జలా !?

పాజిటివ్ ఓటు వస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి పోలింగ్ అయిపోగానే గోళ్లు గిల్లుకుంటూ మీడియాకు చెప్పారు. వైసీపీకి మద్దతు పలికేందుకు అంత పరుగులు పెట్టి ఓటర్లు రావడానికి అవసరమయ్యే ఒక్క పాజిటివ్ కారణం...

ఏపీలో పోలింగ్ పర్సంటేజీ 82 ప్లస్!

ఆంధ్రప్రదేశ్‌లో ఓటరు చైతన్యం వెల్లి విరిసింది. కొత్త ఓటర్లతో పాటు యువత పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపించడంతో పోలింగ్ ఊహించనంతగా పెరిగింది. గత ఎన్నికల్లో 79 శాతం ఈవీఎం ...

అప్పుడే ఓటమికి కారణాలు చెప్పేసిన మంత్రి..!?

సర్వేలన్నీ కూటమిదే అధికారమని తేల్చడం, పోలింగ్ శాతం పెరగడంతో వైసీపీ నేతలు అప్పుడే ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు. కారణం ప్రభుత్వ వ్యతిరేకత కాదని, సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తున్నారు. సాధారణ...

ఏపీలో ముగిసిన పోలింగ్ …పోలింగ్ పెరగడంతో వైసీపీలో టెన్షన్..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాలో వైసీపీ , టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close