జగన్ కంచుకోటని నారా లోకేష్ బ్రద్దలు కొట్టగలరా?

తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ రేపటి నుండి రెండు రోజులపాటు కడప జిల్లాలో పర్యటించబోతున్నారు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బ తీయాలంటే వైకాపాకి కంచుకోటగా ఉన్న కడప జిల్లాపైనే పట్టు సంపాదించాలనే ఉద్దేశ్యంతోనే నారా లోకేష్ కడపకి ప్రయాణం అవుతున్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో మంత్రి కె.టి.ఆర్. చేతిలో ఘోర పరాజయం పొందడంతో నారా లోకేష్ పొలిటికల్ గ్రాఫ్ ఒకేసారి క్రిందకు పడిపోయింది. దానిని మళ్ళీ సరిచేసుకోవాలంటే ఇటువంటి ఘన కార్యమేదో సాధించి చూపాల్సి ఉంటుంది.

కడపలో మొత్తం తొమ్మిది మంది ఎమ్మెల్యేలుంటే వారిలో ఏడుగురు వైకాపాలో ఉన్నారు. కడప మునిసిపల్ కార్పోరేషన్ లో 50 స్థానాలుంటే అందులో 42 వైకాపావే. అలాగే కడప జిల్లా పరిషత్ కూడా వైకాపా చేతిలోనే ఉంది. ఈ పరిస్థితిలో కడపలో తెదేపా పాగా వేయాలంటే తప్పనిసరిగా అక్కడ తన బలం పెంచుకోవలసి ఉంటుంది. అందుకే ‘మిషన్ ఆకర్ష్’ పెట్టుకొని నారా లోకేష్ వైకాపా కంచుకోటలోకి ప్రవేశించి దానిని బ్రద్దలు కొట్టాలని బయలుదేరుతున్నారు.

అయితే కడపలో జగన్మోహన్ రెడ్డికి విశ్వాసపాత్రులుగా ఉన్న ఎమ్మెల్యేలను నేరుగా ఆకర్షించడం కష్టం కనుక ముందుగా వైకాపాలోని రెండవ స్థాయి నేతలను, కార్యకర్తలను తెదేపాలోకి ఆకర్షించే పని పెట్టుకొన్నట్లు సమాచారం. అలాగే కడప మునిసిపల్ కార్పోరేషన్, జిల్లా పరిషత్ సభ్యులపై కూడా లోకేష్ దృష్టి పెట్టవచ్చని సమాచారం. ఇప్పటికే వైకాపాకి చెందిన కడప డిప్యూటీ మేయర్ అరిఫుల్లా తెదేపాలో చేరడానికి సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆయనతో బాటు మరికొందరు కార్పొరేటర్లు తరలివస్తే వైకాపాలో చీలిక ఏర్పడుతుంది.

కడపలో తెదేపాకు ఎలాగూ బలం లేదు గాబట్టి వైకాపా నుండి ఎంతమంది వచ్చినా పార్టీలో చేర్చేసుకోవచ్చును. అయితే ఈ ప్రయత్నాలలో నారా లోకేష్ విఫలమయితే అది ఆయనకి, చంద్రబాబు నాయుడుకి, తెదేపాకి చాలా అవమానకరమవుతుంది కనుక ఈపాటికే స్థానిక నేతలు కొంత ‘గ్రౌండ్ వర్క్’ పూర్తి చేసి వైకాపాకు చెందిన కొంతమంది ద్వితీయ శ్రేణి నేతలను, కార్యకర్తలను తెదేపాలో చేర్చడానికి సిద్దం చేసే ఉంటారని భావించవచ్చును. అదే జరిగితే జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టకి భంగం కలిగినట్లవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close