తమిళ హీరోని ప్రమోట్ చేస్తున్న రవితేజ

వైవిధ్యమైన కాన్సప్ట్ లతో తమిళనాట తనకంటూ ఒక ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు హీరో విష్ణు విశాల్. ఇప్పుడు విష్ణు ద్రుష్టి తెలుగు మార్కట్ పై పడింది. నిజానికి ‘రాక్షసుడు’ సినిమాని నేరుగా తెలుగులో డబ్ చేసి విడుదల చేయాలని భావించాడు. కానీ నిర్మాత రీమేక్ హక్కులని అమ్మేయడం వలన కుదరలేదు. అయితే ఇప్పుడు హీరో రవితేజ, విష్ణుని తెలుగులో ప్రమోట్ చేయడనికి ముందుకు వచ్చాడు. విష్ణు నటిస్తున్న ‘ఎఫ్ఐఆర్’ సినిమాని రవితేజ సమర్పణలో తెలుగులో విడుదలౌతుంది. దీని తర్వాత విష్ణు చేసిన కొత్త సినిమా కూడా రవితేజ సమర్పణలో తెలుగులో విడుదల కానుంది. ఈ విషయాన్ని విష్ణు విశాల్ స్వయంగా చెప్పాడు.

” రాక్షుసుడు సినిమా తెలుగులో విడుదల చేయాలని అనుకున్నా, కానీ కుదరలేదు. ఎఫ్ ఐఆర్ సినిమా రఫ్ వెర్షన్ రవితేజ గారి చూపించా. ఆయనకి నచ్చి తెలుగులో విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత నేను చేస్తున్న మరో కొత్త సినిమా కూడా ఆయనని చూపించా. అదీ ఆయనకి నచ్చి సినిమాకి సమర్పకులుగా ఉండటానికి అంగీకరించారు. నా సినిమాలు ఆయనకి నచ్చడం ఆనందంగా వుంది. నా సినిమా కాన్సెప్ట్ లు విని ఇలాంటి సినిమాలు చేయాలనీ తనకీ వుందని మెచ్చుకున్నారు” అని చెప్పుకొచ్చాడు విష్ణు విశాల్.

అన్నట్టు రవితేజ ఖిలాడీ సినిమా ఈ నెల 11న విడుదలకు సిద్దమౌతుంది. ఎఫ్ఐఆర్ విడుదల తేది కూడా అదే. తన సినిమా వచ్చిన రోజునే తన సమర్పణలో మరో హీరో సినిమా రిలీజ్ చేస్తున్న రవితేజ సినిమా స్పిరిట్ ని అభినందించాల్సిందే. ఐతే… ఖిలాడి రిలీజ్ ఇప్పుడు డైలమా లో పడిందని ఒక టాక్. ఒక వారం ఆలస్యం గా ఈ సినిమా విడుదల కాబోతోంది అని ప్రచారం జరుగుతోంది. కానీ చిత్ర బృందం మాత్రం… ఇంకా స్పందించలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close