జనసేన ఆవిర్భావ సభకూ నో పర్మిషన్ !

ఆవిర్భావ సమావేశాన్ని అత్యంత ఘనంగా నిర్వహించి బలప్రదర్శన చేయాలనుకుంటున్న జనసేనకు ఏపీ ప్రభుత్వం షాకిచ్చేలా ఉంది. ఎవరికీ ఇబ్బంది లేకుండా జాతీయ రహదారికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో సభా వేదికను ఏర్పాటు చేసుకుంటున్నప్పటికీ.., ప్రైవేటు స్థలంలో సభ నిర్వహించుకుంటున్నప్పటికీ.. అనుమతులు మాత్రం ఇవ్వడం లేదు. మార్చి 14న జ‌రిగే స‌భ‌కు అనుమ‌తి కోసం గత నెల 28వ తేదీన పర్మిషన్ ఇవ్వాలని.. సహకరించాలని డీజీపీ కోరినా సహకరించడం లేదని జనసేన నేతలు మండి పడుతున్నారు.

ప్రభుత్వాన్ని నమ్ముకుంటే మొదటికే మోసం వస్తుందని గుర్తించి…జనసేన నిర్వహణపై పర్మిషన్ ఇవ్వాలంటూ హైకోర్టు పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. పార్టీ ఆవిర్భావ సభకు వైసీపీ.. ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తోందని సభ నిర్వహణ బాధ్యతను తీసుకున్న నాదెండ్ల మనోహర్ మండి పడుతున్నారు. పర్మిషన్ ఇవ్వకపోవడంతో నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన ఫైర్ చలానాలు కూడా కట్టలేకపోతున్నామంటున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి కోవిడ్ నిబంధనలు అమల్లో లేవు. అన్ని కార్యకలాపాలు యధావిధిగా సాగుతున్నాయి.

అయితే ఏపీలో రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించడానికి వ్యవస్థ మొత్తాన్ని ఉపయోగిస్తారు. ముఖ్యంగాపవన్ కోసం అయితే ప్రభుత్వమే కదిలి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించడం జనసేనకు ఓ సవాల్‌గా మారిందనిచెప్పుకోవచ్చు. హైకోర్టు అనుమతితో సభ నిర్వహంచాలని జనసేన గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close