కృష్ణంరాజు కుమార్తెకు ‘గోపికృష్ణ’ బాధ్యతలు

రెబల్ స్టార్ కృష్ణంరాజు సొంత బ్యానర్ గోపికృష్ణ. గతంలో ఈ బ్యానర్ పై చాలా సినిమాలు వచ్చాయి. చాలా రోజుల తర్వాత ఇపుడు పాన్ ఇండియా సినిమా ‘రాధే శ్యామ్’తో మళ్ళీ గోపికృష్ణ బ్యానర్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. గోపికృష్ణ బ్యానర్ మళ్ళీ యాక్టివ్ కావడం వెనుక కృష్ణం రాజు కుమార్తె సాయి ప్రశీద వున్నారు. రాధే శ్యామ్ సినిమాకి ప్రశీద ఓ కో ప్రొడ్యుసర్ గా వున్నారు. రాధేశ్యామ్ తో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిగోపికృష్ణ బ్యానర్ లో వరుసగా సినిమాలు నిర్మించాలనేది ప్రశీద ప్లాను.

అయితే కృష్ణం రాజు కుమార్తె అనే ట్యాగ్ తో ఆమె నిర్మాణంలో రాలేదు. ప్రశీద సాహో చిత్రానికి కొన్నాళ్ళు పనిచేశారు. తర్వాత లండన్ లో మాస్టర్స్ చేశారు. దిని తర్వాత ముంబాయిలో ఒక సినిమాకి పని చేశారు. అమెరికాలో ప్రొడక్షన్ కోర్స్ చేశారు. తర్వాత అక్కడ నెట్ ఫ్లిక్ష్ లో ఓ వెబ్ సిరిస్ ఎక్సక్యుటీవ్ ప్రొడ్యుసర్ గా చేశారు. నిర్మాణంలో పూర్తి స్థాయి అనుభవం వచ్చిన తర్వాతే ఇప్పుడు గోపికృష్ణ బ్యానర్ లో సినిమాలు, వెబ్ కంటెంట్ క్రియేట్ చేయాలని ప్రణాళికలు వేసుకున్నారు.

ప్రశీద వెనుక కృష్ణం రాజుతో పాటు ప్రభాస్ కూడా వున్నారు. ప్రభాస్ కి ప్రశీద సినిమా నిర్మాణంలోకి రావడం ఇష్టమే. ప్రశీద నిర్మాతగా మారుతానని చెప్పిన తర్వాత ఇంట్లో మొదట ఆనందపడిన వ్యక్తి ప్రభాసేనట. ప్రస్తుతం ప్రశీద ఓ ప్రముఖ ఓటీటీ వెబ్ సిరిస్ ని ప్లాన్ చేస్తున్నారు. గోపి కృష్ణ బ్యానర్ లో అటు పెద్ద సినిమాలతో పాటు కంటెంట్ వున్న చిన్న సినిమాల నిర్మాణం చేయాలనేది ప్రశీద ఆలోచన. మొత్తానికి కృష్ణం రాజు వారసురాలి రూపంలో గోపికృష్ణ బ్యానర్ కి మళ్ళీ కొత్తరోజులు వచ్చాయని చెప్పుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్ ను కలిసిన రోహిత్ వేముల తల్లి..కేసు రీఓపెన్ కు హామీ

హెచ్ సీ యూ విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, ఈ కేసును ఇంతటితో మూసివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించడంతో తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు రోహిత్...

అనంత శ్రీ‌రామ్ పై బాల‌య్య ఫ్యాన్స్ ఫైర్‌

టాలీవుడ్ లో పేరున్న గీత ర‌చ‌యిత‌... అనంత శ్రీ‌రామ్‌. ఇప్పుడు ఈయ‌న‌కు కూడా రాజ‌కీయం బాగానే వంటబ‌ట్టింద‌నిపిస్తోంది. అప్పుడ‌ప్పుడూ కొన్ని పొలిటిక‌ల్ సెటైర్ల‌తో క‌వ్వించ‌డం అనంత శ్రీ‌రామ్‌కు అల‌వాటే. తాజాగా ఆయ‌న చేసిన...

య‌శ్ స‌ర‌స‌న న‌య‌న‌తార‌

'కేజీఎఫ్`తో య‌శ్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. 'కేజీఎఫ్‌' త‌ర‌వాత య‌శ్ ఎలాంటి సినిమా చేయ‌బోతున్నాడా? అని దేశ‌మంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. ఈ నేప‌థ్యంలో గీతు మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి...

శింగనమల రివ్యూ : కాంగ్రెస్ రేసులో ఉన్న ఒకే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం !

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రేసులో ఉందని చెప్పుకుంటున్న ఒకే ఒక్క నియోజకవర్గం శింగనమల. మాజీ మంత్రి శైలజానాథ్ గతంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close