మేలో పెట్టుబడుల కోసం దావోస్‌కు సీఎం జగన్ !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేయడం లేదని విపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ప్రతి ఏడాది దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు సీఎం జగన్‌ ఈ సారి వెళ్లనున్నారు. ప్రతీ సారి జనవరిలో జరుగుతుంది. కానీ ఈ ఏడాది వాయిదా పడింది. మేలో ఆఖరి వారంలో జరుగుతోంది. సీఎం జగన్‌ను వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఆహ్వానించిందని.. ఆయన కూడా అంగీకరించారని ప్రభుత్వం తెలుపుతోంది. మే ఆఖరి వారంలో వారం రోజుల పాటు దావోస్‌లో పర్యటిస్తారు.

సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు ప్రతి ఏడాది దావోస్‌కు వెళ్లి ఆంధ్రప్రదేశ్‌ను ప్రమోట్ చేసే ప్రయత్నాలు చేసేవారు. ప్రత్యేకంగా స్టాల్ పెట్టేవారు. అయితే సీఎంగా జగన్ వచ్చిన తర్వాత ఏపీ ప్రతినిధి బృందం దావోస్ వెళ్లడం లేదు. అక్కడ్నుంచి ఆహ్వానాలు కూడా అందడం లేదు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు కరోనా పరిస్థితుల నుంచి తెలంగాణ వేగంగా బయటపడటానికి ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఆహ్వానాన్ని పంపింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ప్రపంచ పెట్టుబడిదారుల్లో ఏపీపై అపనమ్మకం ఏర్పడింది.

మొదటి ఏడాది విద్యుత్ రంగంలో పీపీఏల రద్దు వివాదం ఉండటంతో ఏపీ గురించి దావోస్‌లో నెగెటివ్ ప్రచారం జరిగింది. ఏపీ గురించి పారిశ్రామికవేత్తలు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడుల ప్రయత్నాలు చేస్తున్నందు వల్ల సీఎంజగన్ దావోస్ వెళ్తారని భావిస్తున్నారు. అందరిలో అనుమానాలు పటా పంచలు చేస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

డైరెక్టర్స్ డే ఈవెంట్.. కొత్త డేట్‌!

మే 4.. దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రిపై గౌర‌వంతో ఆయ‌న పుట్టిన రోజుని డైరెక్ట‌ర్స్ డేగా జ‌రుపుకొంటోంది చిత్ర‌సీమ‌. నిజానికి ఈ రోజు ఎల్ బీ స్టేడియంలో భారీ ఈవెంట్ జ‌ర‌గాల్సింది. ఎన్నిక‌ల...

గుర్తుకొస్తున్నారు గురువు గారూ!!

ఇండ‌స్ట్రీలో స్టార్లు, సూప‌ర్ స్టార్లు చాలామంది ఉన్నారు. లెజెండ్లు, సెల‌బ్రెటీల‌కైతే లెక్కేలేదు. కానీ గురువు ఒక్క‌రే. ఆయ‌నే దాస‌రి... దాస‌రి నారాయ‌ణ‌రావు. ఇండ‌స్ట్రీ మొత్తం గురువుగారూ.. అనిపిలుచుకొనే వ్య‌క్తి.. ఒకే ఒక్క దాస‌రి. ద‌ర్శ‌కుడిగా ఆయ‌నేంటి? ఆయ‌న ప్ర‌తిభేంటి?...

చాయ్‌కీ.. చైతూకీ భ‌లే లింకు పెట్టేశారుగా!

స‌మంత‌తో విడిపోయాక‌.. నాగ‌చైత‌న్య మ‌రో పెళ్లి చేసుకోలేదు. కాక‌పోతే... త‌న‌కో 'తోడు' ఉంద‌న్న‌ది ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల మాట‌. క‌థానాయిక‌ శోభిత ధూళిపాళ తో చై స‌న్నిహితంగా ఉంటున్నాడ‌ని, వీరిద్ద‌రూ డేటింగ్ చేస్తున్నార‌ని చాలార‌కాలుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close