జగన్ సభల నుంచి జనం పారిపోకుండా ఆపడమెలా ?

సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవల మీట నొక్కే కార్యక్రమాలను బహిరంగసభలుగా నిర్వహిస్తున్నారు. అయితే ఆ సభలకు జనాలను సమీకరించడం.., సభ అయ్యే వరకూ వారిని కదలకుండా కూర్చోబెట్టడం అధికారులకు వైసీపీ నేతలకు పెద్ద సవాల్‌గా మారింది. అది రాజకీయ పార్టీ సభ కాకపోవడంతో వైసీపీ నేతలు పెద్దగా జన సమీకరణ చేయడం లేదు. అధికారులే పథకాల లబ్దిదారులను తీసుకొస్తున్నారు. బలవంతంగానో.. బెదిరించో..బామాలో తీసుకు వస్తున్నారు కానీ ఉంచలేకపోతున్నారు.

సీఎం చెప్పిన సమయానికి వస్తే సమస్యే ఉండదేమో కానీ రెండు, మూడు గంటలు ఆలస్యంగా వస్తున్నారు. ఫలితంగా అసహనానికి గురవుతున్నారు. సీఎం ప్రసంగం స్టార్ట్ చేసే వరకూ ఉండి… హమ్మయ్య ఇకహాజరు వేయించుకున్నా చాలనుకుని లేచి వెళ్లిపోతున్నారు. మొన్న తిరుపతిలో ఇవాళ ఉంగుటూరులోనూ ఇవే సీన్లు రిపీట్ అయ్యాయి. మీడియాలోనూ విస్తృత ప్రచారం జరిగింది. వైసీపీ నేతలు చెప్పుకునే వ్యతిరేక మీడియా ఇలాంటి వాటిని ఎందుకు వదిలి పెడుతుంది.

ఉంగుటూరులో సభ ప్రాంగణం చాలా వరకూ ఖాళీగా ఉంది. వచ్చిన వాళ్లు కూడా మధ్యలోనే వెళ్లిపోయారు. ఇలాంటి పరిస్థితులపై వైసీపీ నేతలు రివ్యూ చేసుకోవాల్సి ఉంది. లేకపోతే… జగన్ ప్రసంగాలను వినేందుకు జగన్ ఆసక్తి గా లేరని.. ప్రజలు ప్రభుత్వంపై పూర్తిగా నమ్మకం కోల్పోయారన్న అభిప్రాయం ఏర్పడుతుంది. ఇప్పటికే గడపగడపకీ ప్రభుత్వం కార్యక్రమంలో ఎక్కువ ఎదురుదెబ్బలు తగులుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నిలదీతల వీడియోలే కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని ఫోటో మాయం..కారణం అదేనా..?

ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమవ్వడం చర్చనీయాంశం అవుతోంది....

రేవంత్ కు నోటీసులు అంతా తూచ్..!!

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసు విషయంలో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు విషయంలో ఢిల్లీ పోలిసుల నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులే అందలేదు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close