జేసీ బ్రదర్స్‌పై ఈడీ గురి !

జేసీ సోదరుల ఇళ్లపై హఠాత్తుగా ఈడీ గురి పెట్టింది. చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు తాడిపత్రిలోని జేసీ సోదరుల ఇళ్లతో పాటు చవ్వా గోపాల్ రెడ్డి అనే కాంట్రాక్టర్ ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. ఏ వ్యాపారంలో ఫిర్యాదులు వచ్చాయన్నదానిపై స్పష్టత రాలేదు. వచ్చీ రాగానే కుటుంబ సభ్యుల ఫోన్లు తీసేసుకుని సోదాలు ప్రారంభించారు. సోదాల సమయంలో జేసీ బ్రదర్స్ ఇంట్లోనే ఉన్నారు.

జేసీ ప్రభాకర్ రెడ్డికి ఆఫ్రికాలో కూడా పలు వ్యాపారాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన మనీలాండరింగ్‌కు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయేమో స్పష్టత లేదు. అదే సమయంలో ఆయనకు ట్రాన్స్ పోర్ట్ బిజినెస్ ఉంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిపై ఉక్కుపాదం మోపారు. ఈ కారణంగా దివాకర్ ట్రావెల్స్ బస్సులు ఇప్పుడు కనిపించడం లేదు. అయితే గతంలో అశోక్ లేల్యాండ్ కంపెనీకి చెందిన బస్సులు అక్రమంగా రిజిస్టర్ చేశారన్న కారణంగా ఆయనపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఆ కేసు కు ఈశాన్య రాష్ట్రాలతో సంబంధం ఉండటంతో ఈ కోణంలోనూ ఏపీ పోలీసుల నుంచి ఫిర్యాదు వెళ్లడంతో ఈడీ సోదాలు చేస్తున్నట్లుగా భావిస్తున్నారు.

జేసీ బ్రదర్స్ వ్యాపారాలు వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత కుప్పకూలిపోయాయి. వారి మైనింగ్, ట్రాన్స్ పోర్ట్ సహా ఏ వ్యాపారమూ సరిగ్గా జరగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనపై ఈడీ దాడులకు దిగడం రాజకీయవర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. ఇటీవల సునీల్ దేవధర్ లాంటి వాళ్లు జేసీ ప్రభాకర్ రెడ్డితో సమావేశం అయ్యారు. బీజేపీ చేరమని ఆఫర్ ఇచ్చారు. అయితే వారు కాదన్నారని అందుకే ఈడీ వచ్చిందన్న చర్చ తాడిపత్రిలో జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...
video

‘గం గం గణేశా’ ట్రైలర్ : నవ్వించే దొంగ

https://www.youtube.com/watch?v=wBZ7EUIM7fY బేబీతో ఓ యూత్ ఫుల్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు 'గం గం గణేశా' సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇదొక క్రైమ్ కామెడీ. తాజాగా ట్రైలర్ ని వదిలారు....

జగన్ ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేసిన వైవీ సుబ్బారెడ్డి

వైవీ సుబ్బారెడ్డి జగన్ రెండో ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేశారు. విశాఖలో ప్రమాణం చేస్తానని జగనే ప్రకటించారు కాబట్టి ఎక్కడ అనే సందేహం లేదు. తొమ్మిదో తేదీన ప్రమాణం చేస్తారని బొత్స సత్యనారాయణ ఇంతకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close