మీడియాకు ఎక్కింది బాలశౌరీనే అయినా పేర్ని నానికే చీవాట్లు !

తాను సీఎం జగన్ కుటుంబానికి పెద్ద పాలేరునని మీడియా ముందు గర్వంగా ప్రకటించుకున్న పేర్ని నాని పై జగన్ పూర్తిగా విశ్వాసం కోల్పోయినట్లుగా కనిపిస్తోంది. మచిలీపట్నం ఎంపీ మీడియా ఎదుట ఆరోపణలు చేసి పార్టీ పరువు తీసినప్పటికీ.. ఆయనను కాకుండా పేర్ని నానినే పిలిచి సజ్జల హెచ్చరికలు జారీ చేసినట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. పైగా ఆయన మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి వ్యతిరేకంగా వెళ్తే.. పేర్ని నాని మంత్రిగా ఉన్న కాలంలో సంపాదించుకున్న అక్రమాస్తులన్నింటినీ బయట పెడతామని ఆ జాబితాను మీడియాకు లీక్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఆదిలాబాద్ దగ్గర పేర్ని నాని వంద ఎకరాలు కొన్నారట.. ప్రకాశం జిల్లాలో బినామీల పేర్లతో గ్రానైట్ క్వారీ కూడా కొట్టేశారట.. ఇంకా పలు రకాల ఆర్థిక లావాదేవీలూ జరిగాయట. ఈ విషయాలన్నీ సజ్జల క్యాంప్ మీడియాకు లీక్ చేసింది. ఎక్కువ మాట్లాడితే ఈ సమాచారం అంతా తమ దగ్గర ఉందని.. పాలేరు అని కూడా చూడబోమని డైరక్ట్‌గా సంకేతాలు పంపినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం తెలిసే పేర్ని నాని సైలెంట్ అవుతున్నారన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.

అయితే అంత విధేయంగా ఉండే పేర్ని నాని ఒక్క సారిగా ఎందుకు జగన్ విశ్వాసం కోల్పోయారనేది ఎవరికీ అంతు చిక్కకుండా ఉంది. పవన్ పై ఒక్క సారిగా విరుచుకుపడి సొంత కులాన్ని కూడా కించ పర్చుకునే పేర్ని నాని .. ఏ విషయంలో ఇలా తడబడ్డారో ఆయన వర్గీయులకూ అంతుబట్టడం లేదు. బాలశౌరి జగన్ వ్యాపారాలకు బినామీ అన్న ప్రచారం ఉంది. ఈ కారణంగానే తమను దూరం పెడుతున్నారని.. బాలశౌరికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన వర్గీయులు అనుకుంటున్నారు. కారణం ఏదైనా పేర్ని నాని గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అందర్నీ గొడ్డలితో నరికేసి సింగిల్ ప్లేయర్ అవ్వండి – భారతికి షర్మిల సలహా

వైఎస్ జగన్, ఆయన సతీమణిపై వైఎస్ షర్మిలారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బధవారం మీడియాతో మాట్లాడిన షర్మిల వైసీపీ వాళ్లే అధికారంలో ఉండాలి... వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వారందర్నీ...

విజ‌య్ సినిమాల‌కు టైటిళ్లు కావ‌లెను!

రేపు.. అంటే మే 9న విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా విజయ్ కొత్త సినిమాల సంగ‌తులు రేపే రివీల్ కాబోతున్నాయి. మైత్రీ మూవీస్ లో విజ‌య్ ఓ సినిమా చేస్తున్నాడు....

మొదటిసారి కాంగ్రెస్ ట్రాప్ లో మోడీ..!?

ఇన్నాళ్ళు పదునైన విమర్శలతో కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెట్టేసిన ప్రధాని మోడీ మొదటిసారి కాంగ్రెస్ ట్రాప్ లో పడినట్లుగా కనిపిస్తోంది. ప్రతి ఎన్నికల ప్రచార సభలో రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తుండటంతో మోడీ కాంగ్రెస్...

‘మిరాయ్’ నుంచి మ‌రో స‌ర్‌ప్రైజ్‌

'హ‌నుమాన్‌' త‌ర‌వాత తేజా స‌జ్జా నుంచి వ‌స్తున్న సినిమా 'మిరాయ్‌'. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవ‌లే టీజ‌ర్ విడుద‌ల చేశారు. టీజ‌ర్‌లోని షాట్స్,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close