కింగ్ అవ్వాలనుకుని జోకర్ అయిన ఫడ్నవీస్ !

మహారాష్ట్ర మాజీ సీఎం మొత్తం కథ నడిపి చివరికి జోకర్‌గా మిగిలిపోయారు. ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. మహారాష్ట్ర బీజేపీకి తిరుగులేని నేతగా ఉన్న ఆయన… మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం కర్త, కర్మ, క్రియ కూడా. అయితే ఆయనకు దక్కింది మాత్రం డిప్యూటీ సీఎం పదవి. అదే ఆయనకు మొదటి పదవి అయితే సరే అనుకోవచ్చు..కానీ ఐదేళ్లు సీఎంగా చేసి.. తన మంత్రివర్గంలో జూనియర్ మంత్రిగా పని చేసిన షిండే కింద డిప్యూటీగా చేయాల్సి వస్తోంది.

గవర్నర్‌ను కలిసిన తర్వాత సీన్ మారిపోయింది. ఏక్‌నాథ్ షిండేను సీఎంగా ఫడ్నవీస్ స్వయంగా ప్రకటించారు. అయితే తాను మంత్రివర్గంలో ఉండనని ఆయన చెప్పారు. బీజేపీ బయట నుంచి మద్దతు ఇస్తుందని చెప్పుకున్నారు. కానీ బీజేపీ హైకమాండ్ ఫడ్నవీస్‌ ను డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన డిమోషన్ కింద ప్రమాణం చేయక తప్పలేదు. నిజానికి గత రెండున్నరేళ్లుగా మహావికాస్ ఆఘాడీపై దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో బీజేపీ పోరాడుతోంది. రాజ్యసభ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోనే విజయాలు సాధించారు. ఏక్నాథ్ షిండేను కూడా తిరుగుబాటుకు మోటివేట్ చేసింది ఫడ్నవీసేనని చెబుతారు. మళ్లీ సీఎం అవ్వాలని ఆయన అనుకున్నారు.. అవుతానని అనుకున్నారు. కానీ కథ మాత్రం అడ్డం తిరిగింది.

గతంలో బీజేపీ- శివసేన ప్రభుత్వంలో ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉంటే ఏక్ నాథ్ షిండే మంత్రిగా ఉండేవారు. ఇప్పుడు శివసేన చీలిక వర్గం- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో ఏక్ నాథ్ షిండే సీఎం … ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం అయ్యారు. అదే సమయంలో ఓ సారి ముఖ్యమంత్రిగా చేసి.. మళ్లీ డిప్యూటీ సీఎం పదవి చేపట్టినవారు తక్కువే. తనకు పదవి వద్దని ఫడ్నవీస్ ప్రకటించారు. తాను ప్రభుత్వానికి దూరంగా ఉంటానన్నారు. కానీ బీజేపీ హైకమాండ్ ఆదేశంతో ఆయన తక్కువ స్థాయి పదవి చేపట్టక తప్పలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close