“ఆకర్ష్‌”తో బీజేపీని రెచ్చగొడుతున్న కేటీఆర్ !

బీజేపీకి చెందిన హైదరాబాద్, వరంగల్ కార్పొరేటర్లతో పాటు పలు జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో బీజేపీ కౌన్సిలర్లు టీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారు. టీఆర్ఎస్ కూడా అధికార పార్టీ కాబట్టి ఆ పార్టీ చేతిలో కూడా కొన్ని దర్యాప్తు సంస్థలు ఉంటాయి. కావాల్సినంత ధనబలం ఉంటుంది. దీంతో బీజేపీ స్థానిక ప్రజాప్రతినిధులు సులువుగానే ఆ పార్టీ బుట్టలో పడిపోతున్నారు. వారిని పట్టుకొచ్చి కండువా కప్పి.. బీజేపీకి షాక్ అని మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కానీ ఇది బీజేపీని రెచ్చగొట్టడమే అన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే.. ఇలాంటివి బీజేపీ చేయాలంటే.. చేయాలని అనుకుంటే ఎలా ఉంటుందో చాలా రాష్ట్రాల్లో జరిగింది. తాజాగా మహారాష్ట్రలో జరిగిందని గుర్తు చేస్తున్నారు.

తెలంగాణలో ఇప్పుడు బీజేపీ కన్నా ఎక్కువగా సవాళ్లు ఎదుర్కొంటోది టీఆర్ఎస్సే. సిట్టింగ్‌లపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఈ సారి యాభై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వడం లేదని టీఆర్ఎస్‌ పెద్దలు చెబుతున్నారు.ప్రశాంత్ కిషోర్ సర్వేలో గెలుస్తారు అని తెలిస్తేనే టిక్కెట్ ఇస్తారు. లేకపోతే లేదు. ఇప్పటికే చాలా మంంది ఎమ్మెల్యేలకు తమ భవిష్యత్ ఏమిటో తేలిపోయింది. అందుకే వారు పక్క చూపులు చూస్తున్నారన్న చర్చ జరుగుతోంది. భారతీయ జనతా పార్టీకి ఇలాంటి అసంతృప్తులను పట్టుకోవడంలో సాటిలేని నైపుణ్యం ఉంది.

బీజేపీ వర్గాలు కూడా చాలా మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని చెబుతూ వస్తున్నాయి. చాలా మంది అంటే ఎంత మంది అనేది వాళ్లకీ తెలియదు కానీ… ఎంత మంది ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉంది.. ఎంత మంది బీజేపీ ఆకర్ష్‌కు పడిపోతారో అంత మంది అని చెప్పుకోవచ్చు. వారు కనీసం యాభై మంది ఉంటారని బీజేపీ వర్గాలు ఇప్పటికే ప్రచారం చేసేస్తున్నాయి. తమ కార్పొరేటర్లను లాగేసుకుంటున్న టీఆర్ఎస్‌కు అంతకు మించిన షాక్ ఇవ్వాలని బీజేపీ అనుకుంటే ఇవ్వడం పెద్ద విషయం కాదు.. టైమింగ్‌ను బట్టి యాక్షన్ బయటకు వస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కేటీఆర్ జాతీయ నాయకుల్ని రెచ్చగొట్టాలనుకునే ప్రయత్నం చేయడం మంచిది కాదన్న వాదన కూడా వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏడు మండలాలు కాదు. ఐదు గ్రామాలే అంటున్న కాంగ్రెస్ !

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోల ఐదు గ్రామాల ప్రస్తావన తీసుకు వచ్చింది. ఏపీలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలుపుతామని ప్రకటించింది. దీంతో కొత్త వివాదం ప్రారంభమయింది. ఇది ఓ రకంగా గట్టు తగాదా...

నిరాసక్తంగా జగన్ ప్రచారం – ఆశలు వదిలేసుకున్నట్లే !

ఏపీ సీఎం జగన్ ప్రచారానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. రెండు, మూడు రోజులకో సారి తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమవుతున్నారు. ప్రచార సభల్ని పరిమితం చేసుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్...

ఒంగోలు లోక్‌సభ రివ్యూ : డబ్బుతొ గెలిచేస్తానని చెవిరెడ్డి లెక్కలు

ఒంగోలు ఎంపీ సీటు హాట్ కేకులా మారింది. ఆగర్భ శ్రీమంతుడైన మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తూండగా.. ఎన్నికల అఫిడవిట్‌లోనూ పెద్దగా ఆస్తులు,. ఆదాయం చూపించలేని చెవిరెడ్డి భాస్కర్...

మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ను ఓడిస్తే రేవంత్ ను ఓడించినట్లే !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో విపక్షాల రాజకీయం రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది. ఆయనను దెబ్బకొట్టాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. సొంత నియోజకవర్గం అయిన మహబూబ్ నగర్ లోక్ సభలో ఓడిస్తే ఆయనకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close