తెలంగాణకు వచ్చిన ఢిల్లీ లిక్కర్ స్కాం !

ఢిల్లీ లిక్కర్ స్కాం తెలంగాణలోనూ కలకలం రేపే అవకాశఆలు కనిపిస్తోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మనీశ్ సిసోడియాతో పాటు 15 మందిని ఎఫ్ఐఆర్‌లో నిందితులుగా సీబీఐ పేర్కొంది హైదరాబాద్‌కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లై పేరు కూడా ఎ 14గా సీబీఐ ఎఫ్ఐఆర్‌లో ఉండటం కలకలం రేుపతోంది. లిక్కర్ స్కామ్‌లో ఏ1 గా సిసోడియా పేరు .. ఏ14 గా రాంచంద్ర పిళ్లై పేరును చేర్చారు. ఇండో స్పిరిట్ పేరుతో బెంగళూరు కేంద్రంగా లిక్కర్ రాంచంద్ర పిళ్లై లిక్కర్ వ్యాపారం నిర్వహిస్తున్నట్లుగా సీబీఐ అధికారులు చెబుతున్నారు. ఆయన ఆయన ఆ కంపెనీలో డైరక్టర్‌గా లేరు.

కానీ రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్‌పీ అనే కంపెనీలో డైరక్టర్‌గా ఉన్నారు. ఈ కంపెనీలో ఆయనతో పాటు ఉన్న మరో డైరక్టర్ పేరు బోయినపల్లి అభిషేక్. ఢిల్లీ కొత్త లిక్కర్ పాలసీలో భాగంగా టెండర్ దక్కించుకోవడానికి అరుణ్ పాండ్యా ద్వారా మనీష్ సిసోడియాకు డబ్బులు ఇచ్చినట్లుగా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. రూ. 2.50 కోట్లు సిసోడియాకు లంచంగా ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ స్కాంతో తెలంగాణకు సంబంధం ఉందని బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ ఢిల్లీలో ప్రకటించారు.

కొత్త పాలసీ రూపకల్పన .. స్కామ్ అంతా అంతా తెలంగాణలోనే జరిగిందని ఆయన అంటున్నారు. ఈ డీల్ సెట్ చేయడానికి తెలంగాణకు చెందిన వాళ్లు బుక్ చేసిన హోటళ్లు, రెస్టారెంట్లకు మనీష్ సిసోడియా వెళ్లారని తెలిపారు. ఇందులో 10 నుంచి 15 మంది ప్రైవేట్ వ్యక్తులతో పాటు సిసోడియా కూడా ఉన్నారని భావిస్తున్నట్టు వివరించారు. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కాం తెలంగాణ వరకూ వచ్చినట్లుగా తెలుస్తోంది. రామచంద్ర పిళ్లై శాశ్వత నివాసం హైదరాబాద్ లో ఉంది. దీంతో ఇక్కడా రాజకీయ ప్రకంపనలు రేగడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈసీ ఫెయిల్యూర్ – పోస్టల్ బ్యాలెట్స్ ఇలానా ?

ఏపీ ఎన్నికల సంఘం పనితీరు అత్యంత ఘోరంగా ఉంది. కనీసం పోస్టల్ ఓటింగ్ ను సరైన పద్దతిలో నిర్వహించడం కూడా చేత కాలేదు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ స్మూత్ నిర్వహించడానికి...

‘హీరామండి’ వెబ్ సిరిస్ రివ్యూ: నయనానందమే కానీ…

Heeramandi Web Series Review సంజయ్ లీలా భన్సాలీ.. ఇండియన్ సినిమాలో పరిచయం అవసరం లేని దర్శకుడు. భారీదనం ఉట్టిపడే కళాత్మక చిత్రాలతో పేరుతెచ్చున ఆయన ఇప్పుడు వెబ్ వరల్డ్ లోకి అడుగుపెట్టారు. ఆయన...

పెరిగిన రేవంత్ క్రేజ్…పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయం

లోక్ సభ ఎన్నికల్లో చార్ సౌ పార్ నినాదం వెనక అసలు ఎజెండా రిజర్వేషన్లు, రాజ్యాంగం రద్దు అంటూ బీజేపీని జాతీయస్థాయిలో ఇరకాటంలోకి నెట్టిన రేవంత్ సేవలను దేశవ్యాప్తంగా వాడుకోవాలని ఆ పార్టీ...

కవిత బెయిల్ పిటిషన్ పై నేడే తీర్పు..

లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై సోమవారం తీర్పు వెలువరించనుంది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ కేసులో తనను ఈడీ, సీబీఐలు అక్రమంగా అరెస్ట్ చేశాయని, తనకు బెయిల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close