పాదయాత్రల సీజన్.. ఇక లోకేష్ కూడా !

నారా లోకేష్ పాదయాత్రకు రెడీ అవుతున్నారు. పాదయాత్ర రాజకీయాల్లో సెంటిమెంట్‌గా మారిపోయింది. ప్రతీ ఎన్నికలకు ముందు ఎవరో ఒకరు పాదయాత్ర చేయడం కామన్‌గా మారిపోయింది. ఇప్పడంతా పాదయాత్రల సీజన్ నడుస్తోంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. తెలంగాణలో బండి సంజయ్ విడతల వారీగా పాదయాత్ర చేస్తున్నారు. గతంలో వైసీపీ కోసం మూడు వేల కిలోమీటర్లకుపైగా తిరిగిన షర్మిల ఇప్పుడు తెలంగాణలో అదే పని చేస్తున్నారు. ఏపీలో నారా లోకేష్ రంగంలోకి దిగుతున్నారు.

పవన్ కల్యాణ్ పాదయాత్ర చేస్తారని అభిమానులు చాలా ఆశపడ్డారు కానీ ఆయన బస్సు యాత్రకే పరిమితమయ్యారు. దసరా నుంచి ప్రారంభిస్తున్నారు. లోకేష్ మాత్రం సంక్రాంతి నుంచి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల వరకూ పాదయాత్ర జరగనుంది. ఇటీవలి కాలంలో లోకేష్ పార్టీపై పట్టు పెంచుకున్నారు. ఆయన పర్యటనలపై క్యాడర్ ఆసక్తికరంగా స్పందిస్తోంది. జనవరి కల్లా పార్టీ అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత చంద్రబాబు జిల్లాల పర్యటనలు చూసుకుంటే.. లోకేష్ పాదయాత్ర కొనసాగించే అవకాశం ఉంది.

ప్రస్తుతం వైసీపీ జనానికి దూరంగా ఉంటోంది. సీఎం జగన్ ప్రజల్లోకి వెళ్లడం మానేశారు. పరదాలు కట్టుకుని జిల్లాల్లో పర్యటించడం మినహా ఆయ నచేస్తున్నదేం లేదు. అధికార పార్టీగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో విఫలం కావడంతో గడప గడపకూ వెళ్తన్న ప్రజాప్రతినిధులపై అసంతృప్తి కనిపిస్తోంది. ఇలాంటి సందర్భంలో ప్రజలందరికీ భరోసా ఇవ్వడానికి.. పార్టీకి ఊపు తేవడానికి లోకేష్ పాదయాత్ర ఉపయోగపడే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close