పీకే టీం సర్వేలకు కేసీఆర్ గుడ్ బై !

తెలంగాణ సీఎం కేసీఆర్ పీకే టీం సేవలను తగ్గించుకున్నారు. ఆ టీంతో సర్వేలు అవసరం లేదని తేల్చి చెప్పారు. దీంతో తెలంగాణలో పని చేస్తున్న దాదాపు నలభై సర్వే టీములు పని మానేశాయి. చివరికి మునుగోడులోనూ ఐ ప్యాక్ టీములు పని చేయడం లేదు. అవన్నీ ఏపీలో సర్వేలు చేయడానికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. అక్కడ కూడా పీకే టీమే జగన్‌కు సేవలు అందిస్తోంది. పీకే టీం హఠాత్తుగా సర్వేలు మానేయడానికి కారణం కేసీఆర్‌కు కోపం రావడమేనని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

ఇటీవల తెలంగాణలో పీకే టీం సర్వేలు ఉంటూ కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో వైరల్ అయ్యాయి. అవి టీఆర్ఎస్‌కు నెగెటివ్ గా ఉన్నాయి. అదే సమయంలో అదే సర్వే రిపోర్టు కేసీఆర్ చేతికి వెళ్లింది. ముందే లీక్ కావడం.. సీక్రెట్‌గా ఉంచాల్సిన వాటిని లీక్ చేయడంపై కేసీఆర్ అసంతృప్తికి గురయ్యారు. ఇక తమ పార్టీకి సర్వే సేవలు వద్దని పీకేకి తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. కేవలం సోషల్ మీడియా స్ట్రాటజీలు చూసుకుంటే చాలని చెప్పినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

దీంతో రిక్రూట్ చేసుకున్న సిబ్బందిని ఏం చేయాలో తెలియక.. ఏపీకి పంపారని.. జగన్ కోసం.. ఇప్పుడు ఆ టీములన్నీ ఏపీలో తిరుగుతున్నాయని చెబుతున్నారు. పీకే సర్వేలను కేసీఆర్ వదిలించుకోవడంతో.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. తమకు టిక్కెట్లు ఇచ్చేది పీకేనేనని ఇప్పటి వరకూ వారిలో ఆందోళన ఉండేది. ఇప్పుడు కేసీఆర్ … సిట్టింగ్‌లు అందరికీ టిక్కెట్లు ఇస్తామన్నట్లుగా మాట్లాడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కర్ణాటకపై బీజేపీ నజర్..ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..!!

మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చుతుందని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో లాగే కర్ణాటకలోనూ...

వన్స్ మోర్ ‘సుచి లీక్స్’: ఈసారి ధనుష్, జీవీ ప్రకాష్

సినిమా వార్తలని ఫాలో అయ్యేవారికి సుచీ లీక్స్ గురించి పరిచయం అవసరం లేదు. 'సుచీ లీక్స్‌' పేరుతో కోలీవుడ్‌లో దుమారం రేపారు సింగర్‌ సుచిత్ర. అప్పట్లో ఆమె నుంచి వచ్చిన...

పుష్ప ఇంపాక్ట్.. బన్నీ ఫుల్ క్లారిటీ

సినిమా ప్రభావం ఖచ్చితంగా సమాజంపై వుంటుందని కొందరి అభిప్రాయం. సమాజంలో ఉన్నదే సినిమాలో ప్రతిబింబిస్తుందని మరికొందరి మాట. సినిమాని సినిమాగా చుస్తారానినేది ఇంకొందరి వాదన. హీరో అల్లు అర్జున్ కూడా ఇదే అభిప్రాయాన్ని...

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు… ఆందోళనలో కవిత అభిమానులు..?

అత్యంత భద్రత నడుమ ఉండే తీహార్ జైలుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. జైలును పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు. ఆగంతకుల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close