రాజమండ్రి ఎంపీ నేతృత్వంలో అమరావతి రైతులపై దాడి !

వైసీపీ నేతలు కట్టుదాటి పోతున్నారు. చివరికి రైతులపై దాడికి పాల్పడుతున్నారు. చాలా స్పష్టంగా వైసీపీ నేతలు ఇతర ప్రాంతాల నుంచి రౌడీ షీటర్లను ఆర్గనైజ్ చేసుకుని మరీ దాడులకు పాల్పడ్డారు. రాజమండ్రిలో రైతుల పాదయాత్ర ఉన్న దారిలోనే వైసీపీ నేతలు రెండు, మూడు వందల మందిని సమీకరించి.. సభ ఏర్పాటు చేశారు. వైసీపీ ఎంపీ భరత్‌కు స్పెషల్ టాస్క్ ఇచ్చారు. ఆయనే లక్షలు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జనాలను తీసుకొచ్చి మోహరింప చేశారు.

అమరావతి రైతులు రాజమండ్రిలోకి ఎంటర్ కాగానే కవ్వింపులు ప్రారంభమయ్యాయి. ఓ దశలో రైతులపైకి కుర్చీలు..వాటర్ బాటిళ్లు విసిరారు. గొడవలు.. ఘర్షణ జరగడానికి ఇది సరిపోదని అనుకున్నారేమో కానీ నేరుగా రాజమండ్రి ఎంపీ భరత్ రంగంలోకి దిగారు. రైతులపై దాడికి ఉసిగొల్పారు. దీంతో పరిస్థితి దిగజారింది. ఉద్దేశపూర్వకంగా రాజమండ్రి ఎంపీ ఈ కవ్వింపు చర్యలకు పాల్పడినట్లుగా వీడియోల్లో స్పష్టంగా ఉంది.

అమరావతి రైతులకు వ్యతిరేకంగా వైసీపీనేతలే డబ్బులు ఖర్చుపెట్టి మరీ ఉద్యమిస్తున్నారు. ప్రజా స్పందన లేకపోయినా ఉందన్నట్లుగా చూపించడానికి రౌడీ మూకల్ని ఉసిగొల్పుతున్నారు. భద్రత కల్పించాల్సిన పోలీసులు సైలెంట్ గా ఉంటున్నారు. పోటీ నిరసనలకు అనుమతి ఇస్తున్నారు. దాడులు జరిగితే .. వైసీపీ నేతలపై కాకుండా బాధితులపై ఎక్కువ కేసులు పెడుతున్నారు. ఇలాంటి పోలీసింగ్ ఎక్కడా చూడలేని ప్రజలు కూడా అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కూటమిదే విజయమని వైసీపీ అభ్యర్థుల బెట్టింగులు..!!

స్వయంగా జగన్ రెడ్డి గతంలో కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని ప్రకటించినా వైసీపీలో ఆ ధీమా ఏమాత్రం కనిపించడం లేదు. ఇప్పటికే బెట్టింగ్ రాయుళ్లు కూటమిదే అధికారమని లక్షల్లో బెట్టింగ్ కాస్తుండగా...వైసీపీ తరఫున...

ఓట్లు ఎలా వస్తాయో అలానే మోదీ ప్రచారం !

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి కాలంలో మతప రమైన అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ వస్తే రామ మందిరాన్ని బుల్డోజర్లతో కూల్చేస్తుందని ప్రచారం చేస్తున్నారు. మోదీ...

మళ్లీ అదే నినాదం ఎత్తుకున్న మోడీ – ఏంటి సీక్రెట్ ..?

కొద్ది రోజులుగా కాంగ్రెస్ పై ఎదురుదాడి చేయడానికి ప్రాధాన్యత ఇచ్చిన ప్రధాని తాజాగా మరోసారి 400సీట్లు అంశాన్ని తెరపైకి తీసుకురావడం ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల్లో బీజేపీ గతం కన్నా ఎక్కువగా సీట్లు...

ఆ విషయంలో మంత్రులు ఫెయిల్..!?

కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ గా ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తిపోస్తున్నా ఒకరిద్దరూ మంత్రులు మినహా మిగతా వారెవరూ పెద్దగా స్పందించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. వీటన్నింటికి రేవంత్ ఒక్కడే కౌంటర్ ఇస్తున్నారు తప్పితే మంత్రివర్గం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close