అప్పుల ఆడిట్ చేస్తున్న కాగ్ అధికారులకూ బెదిరింపులట !?

నిజం చెప్పారో సంగతి చూస్తా..! అనే బెదిరింపులు ఇప్పుడు కామన్. అది మీడియా , సోషల్ మీడియా మాత్రమే కాదు.. ప్రభుత్వ ఉద్యోగులకూ తప్పడం లేదని సచివాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ అప్పుల లెక్కలు తేల్చడానికి కాగ్ బృందం ఏపీలోకి వచ్చింది. వారు మొత్తం అవకవతవకలపై వివరాలు సేకరిస్తున్నారు. ముఖ్యంగా అప్పుల లెక్కలు తీస్తున్నారు. ఇలా ఆరా తీస్తున్న అధికారులతో… ఖజానా గల్లాపెట్టేను దగ్గర పెట్టుకున్న ఉన్నతాధికారులు బెదిరింపులకు దిగారట. దీంతో సచివాలయంలో గందరగోళం ఏర్పడింది. దాదాపుగా వారం రోజుల కిందట జరిగిన ఈ వ్యవహారం తర్వాత కాగ్ అధికారులు అప్పులపై మరింత నిశితంగా పరిశీలన జరుపుతున్నట్లుగా సచివాలయ వర్గాలు చెబుతున్నాయి.

మరో వైపు ఆర్థిక శాఖ అధికారులందర్నీ కూర్చోబెట్టి… దృశ్యం సినిమాలో వెంకటేష్ చెప్పినట్లుగా .. మన అప్పులు ఇంతే.. ఇంతకు మించి మనం ఒక్క పైసా తీసుకోలేదు.. ఏమి అడిగినా ఏమీ తెలియదనే చెప్పాలని.. క్లాస్ తీసుకున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. కాదు కూడదని ఎవరైనా నిజం చెప్పారో .. వచ్చే నెల నుంచి జీతాలు రావని వారికి ఉన్నాతాధికారులు బెదిరిస్తున్నారట. తప్పుడు లెక్కలు ఇస్తే ఇవాళ కాకపోతే తాము ఇరుక్కుపోతామని ఉద్యోగులు వణికిపోతూంటే.. చెప్పొద్దని ఉన్నతాధికారలే ఒత్తిడి చేస్తున్నారు. ఇది ఆర్థిక శాఖలో ఇప్పుడు క్లిష్టమైన సమస్యగా మారింది.

ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకోవాల్సిన అప్పుల పరిమితి పూర్తయింది. ప్రస్తుత ఆడిట్ జరిగితే… ఇక కేంద్రాన్ని బతిమాలి అదనపు అప్పులు తీసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. అందుకే వీలైనంత తక్కువ అప్పులు తీసుకున్నట్లుగా చూపించాలని అనుకుంటున్నారు. తమ వాదనకు అంగీకరించేలా పై స్థాయి నుంచి ఒత్తిడి తెచ్చేందుకు వైసీపీ పెద్దలు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. అయితే .. ప్రస్తుతం సచివాలయంలో జరుగుతున్న కాగ్ ఆడిట్ .. బెదిరింపుల వరకూ వెళ్లడమే అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close