మునుగోడులో కేసీఆర్ ప్రచారం లేనట్లే !

మునుగోడు ఉపఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం లేనట్లేనని టీఆర్ఎస్ వర్గాలు నిర్ణయానికి వచ్చేశాయి. కేటీఆర్ మాత్రం సమయం కేటాయించి రెండు విడతలుగా ప్రచారం చేయనున్నారు. ఉపఎన్నికలు ఖాయమని తెలిసిన తర్వాత కేసీఆర్ఓ బహిరంగసభలో ప్రసంగించారు. ఇప్పుడు పార్టీ నేతలు రెండు బహిరంగసభలకు ప్లాన్ చేసుకున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ప్రచారానికి ఆసక్తి చూపించడం లేదు.టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మునుగోడులో విస్తృత ప్రచారం చేయనున్నారు. శుక్రవారం ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు.

ఇటీవల ఉపఎన్నికల్లో కేటీఆర్ పెద్దగా ప్రచారం చేయలేదు. దుబ్బాకతో పాటు తాను సిట్టింగ్ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో వచ్చిన ఉన్న హూజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చిన ఉపఎన్నికల్లోనూ ఆయన ప్రచారం చేయలేదు. మొత్తం బాధ్యతలను హరీష్ రావే చూసుకున్నారు. కానీ మునుగోడు విషయంలో మాత్రం ఆయన రంగంలోకి దిగారు. కేసీఆర్ ప్రచారానికి రావడం లేదని.. అదుకే కేటీఆర్ రంగంలోకి దిగారన్న అభిప్రాయం టీఆర్ఎస్‌లో వినిపిస్తోంది.

ఉపఎన్నికల్లో సాధారణంగా కేసీఆర్ ప్రచారం చేయరు. అధికార పార్టీగా ఉండి ఉపఎన్నికల్లో ఓడిపోతే ఓ సమస్య .. సీఎం ప్రచారం చేసి మరీ ఓడిపోతే మరో సమస్య. అందుకే కేసీఆర్ దూరంగా ఉంటారని చెబుతారు. అయితే పార్టీకి చేదు ఫలితం వస్తే.. కేసీఆర్ బహిరంగసభ నిర్వహిస్తే.. ప్రచారం చేస్తే ఫలితం వేరేగా ఉండేదన్న విశ్లేషణలు వస్తాయి. దుబ్బాకలో స్వల్ప తేడాతో ఓడిపోయినప్పుడు ఇదే చెప్పుకున్నారు. మరి చాన్సివ్వకూడదని చివరి రోజు అయినా కేసీఆర్ బహిరంగసభలో ప్రసంగిస్తారో లేదో చూడాలి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close