రాజకీయాలు చెడిపోయాయి – ఇంకా పదవిలో ఎలా !?

రాజకీయాలు చెడిపోయానని జగన్మోహన్ రెడ్డి తరచూ బాధపడుతూంటారు. ఆయనను చూసి సామాన్యులు కూడా బాధపడుతున్నారు. ఇంత దారుణంగా రాజ్యాంగ వ్యవస్థల అభిశంసనకు గురై..అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న ఏపీ ప్రభుత్వ పెద్దలు ఏ మాత్రం సిగ్గుపడకుండా ఇంకా పదవిలో ఎలా కొనసాగుతున్నారన్నదే చాలా మందికి ఆశ్చర్యం వేస్తోంది. అసలు తమకేమీ సంబంధం లేదన్నట్లుగా వారు దులిపేసుకుంటున్న వైనం .. నిశ్చేష్టుల్ని చేస్తోంది. పైగా.. అది తమకు సంతోషం అంటూ కల్లిబొల్లి కబుర్లు చెప్పి… అమాయకత్వం నటిస్తున్నారు.

సొంత బాబాయి హత్యకేసులో నిందితులకు అండగా ఉండే సీఎం !

ఓ ముఖ్యమంత్రి బాబాయి హత్యకేసులో నిందితుల్ని కాపాడటానికి ప్రయత్నించడమా? ఇంత దారుణమైన పరిస్థితి స్వతంత్ర ప్రజాస్వామ్య భారతంలో ఎప్పుడూ ఉండదు. ఆ స్థానంలో ఉన్న వారు అలా ఆలోచించకూడదు. కానీ సీఎం జగన్ ఆలోచించారు. ఆయన తీరు ఎలా ఉందంటే… నిందితుల్ని కాపాడటానికి .. వైఎస్ వివేకా కుమార్తె , సోదరిపై నిందలు వేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఆయన ప్రేమేయం లేకుండా వివేకా కేసులో పరిణామాలు జరిగాయని అనుకునే చాన్స్ లేదు.

ప్రతీ విషయంలో యూటర్న్‌లే – చేయకపోతే చెబుతున్నామంటూ అడ్డగోలు వాదన !

ఒక్క వివేకా కేసు మాత్రమే కాదు.. విపక్షంలో ఉన్నప్పుడు తాను ఏం చెప్పాలో అన్నీ రివర్స్‌లో చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో చేసిన వాటిలోనే మరింత ఎక్కువగా చేస్తున్నారు. విద్యుత్ ఒప్పందాలు పాతికేళ్లకు ఒప్పందం చేసుకోవడం అవినీతి అని చెప్పి తాను ముఫ్పై ఏళ్లకు చేసుకున్నారు. టీడీపీ హయాంలో అంతర్జాతీయ సంస్థలు వస్తే.. జగన్ హయాంలో ఆయన బంధువుల కంపెనీలే వచ్చాయి. విద్యుత్ ఒప్పందాల దగ్గర్నుంచి ప్రారంభించి ప్రతీ విషయంలోనూ అదే తంతు. బోగాపురం ఎయిర్ పోర్టు కాంట్రాక్ట్ జీఎంఆర్‌కి ఇస్తే… రద్దు చేసి మళ్లీ జీఎంఆర్‌కే ఇచ్చారు. ఇలాంటివి లెక్కలేస్తే వందల్లో ఉంటాయి. అయినా సిగ్గుపడటం లేదు. ఇక సీపీఎస్ రద్దు, ప్రత్యేకహోదా వంటి విషయాల్లో నిర్వాకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పైగా చేయలేకపోతే చెబుతున్నామంటూ వితండవాదం ఒకటి.

ఆర్థికంగా ఏపీ ఊపిరిని నొక్కేసినా… షిక్కని చిరునవ్వులే !

ఇక ఏపీకి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును పూర్తిగా పడుకోబెట్టేశారు. శరవేగంగా సాగుతున్న నిర్మాణాన్ని కాంట్రాక్టర్‌ను మార్చడం ద్వారా నాశనం చేసేశారు. ఇప్పుడా ప్రాజెక్టును ఎత్తిపోతలకు పరిమితం చేసే ఆలోచన చేస్తున్నారు. ఇక అమరావతి ని నిలిపివేసి మూడు రాజధాలనుల పేరుతో ఏపీ ఆర్థిక పునాదుల్ని కూల్చేశారు. పొరుగు రాష్ట్రాలు అన్నీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు.. పరిశ్రమల ఆకర్షణలో దూసుకెళ్తూంటే.. ఏపీని నాకించేసి… ప్రతీ ఇంటికి డబ్బులిస్తున్నా.. ముఫ్పై ఏళ్ల పాలన చేస్తానంటూ బయలుదేరుతున్నారు.

రాజకీయాలు చెడిపోవడమంటే ఇదే !

నిర్ణయాల్లో యూటర్న్‌లు.. న్యాయస్థానాల్లో అభిశంసనలు ఎదుర్కొన్నా… ఏ మత్రం తొణకకుండా.. తప్పు చేస్తున్నామని అనుకోకుండా.. సిగ్గు లేకుండా ఇంకా పాలన చేస్తున్నారు. ఇదే రాజకీయం చెడిపోవడం అంటే !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close