జాతీయ రాజకీయం ప్రారంభించకుండానే మిత్రుల నమ్మకం కోల్పోతున్న కేసీఆర్ !?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఖమ్మం సభకు ముగ్గురు ముఖ్యమంత్రులు వచ్చారు. వారిలో ఇద్దరు ఆమ్ ఆద్మీ పార్టీ సీఎంలు, ఒకరు లెఫ్ట్ పార్టీ సీఎం. కానీ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రారంభించినప్పటి నుండి సపోర్టుగా నిలిచిన కొంత మంది ఎక్కడా కనిపించలేదు. వారిలో ముఖ్యులు కర్ణాటక జేడీఎస్ నేత కుమారస్వామి, మరొకరు తమిళనాడు వీసీకే పార్టీకి చెందిన ఎంపీ తిరుమాలవన్. ఇప్పుడు వారు కేసీఆర్ వెంట లేరు. బీఆర్ఎస్ ఆవిర్భావసభకు కూడా రాలేదు. కేసీఆర్ తో పొత్తులు ఉంటాయని.. ఆయా రాష్ట్రాల్లో బీఆర్ఎస్‌తో కలిసి పని చేయాలనివారు అనుకున్నారు. కానీ హఠాత్తుగా డ్రాప్ అయిపోయారు.

నిజానికి కేసీఆర్ సభకు వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాంటి పొత్తులు ఎవరితోనూ పెట్టుకోదు. కేజ్రీవాల్ కు సొంత లక్ష్యాలున్నాయి. ఆయన రెండు రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తెచ్చారు. మరిన్ని రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన పార్టీకి జాతీయ హోదా కూడా వచ్చింది..కాబట్టి.. కేసీఆర్ ఓ కూటమి పెట్టినా.. అందులో ఆమ్ ఆద్మీ రాదు. అలాగే.. లెఫ్ట్ పార్టీలు కూడా. తెలంగాణలో సీట్ల కోసం లెఫ్ట్ పార్టీలు.. కేసీఆర్ తో పొత్తులు పెట్టుకుంటాయి కానీ.. జాతీయ స్థాయిలో ఆయన వెంట నడవవు. రాహుల్ గాంధీ పాదయాత్రలో లెఫ్ట్ పార్టీల నేతలు పాల్గొంటున్నారు . కేసీఆర్ సభలో పాల్గొన్న సీపీఐ నేత రాజా.. రాహుల్ పాదయాత్రలోనూ పాల్గొంటానని అదే రోజు మల్లిఖార్జున్ ఖర్గేకు లేఖ రాశారు.

అంటే కేసీఆర్.. సభకు వచ్చిన వారు జాతీయ రాజకీయాల్లో ఆయన వెంట ఉండరు. ఉంటారనుకున్న వారు నమ్మకం కోల్పోయారు. ఈ కారణంగాకేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తొలి అడుగులే తడబడుతన్నాయన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. భారీ ఆర్థిక సాయం ఎన్నికల్లో ఇస్తామని చెప్పి కేసీఆర్ ఇతర నేతల్ని ఆకర్షిస్తున్నారని.. ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వారిలో అఖిలేష్ లాంటి నాయకులు ఉన్నా.. వారు కేసీఆర్ తో జత కట్టడం అనేది ఉండదని అంటున్నారు. మొత్తంగా కేసీఆర్ .. జాతీయ రాజకీయాల్లో రాణించాలంటే.. నమ్మకస్తులైన నేతల్ని గ్రూపుగా ఉంచుకోవాలన్న సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్‌కు పీకే నాడు గెలిపించేవాడు – నేడు నథింగ్ !

ప్రశాంత్ కిషోర్ నథింగ్ అని ఐ ప్యాక్ ఆఫీసులో జగన్ పలికిన మాటలకు అక్కడ ఉన్న భారీ ప్యాకేజీలు అందుకుని తూ..తూ మంత్రంగా పని చేసిన రిషిరాజ్ టీం చప్పట్లు కొట్టి ఉండవచ్చు...
video

‘ల‌వ్ మీ’ ట్రైల‌ర్‌: భ‌యంతో కూడిన ఓ ప్రేమ‌క‌థ‌!

https://youtu.be/BacOcD8e_3k?si=D6mw3GiNjusn8mnE దెయ్యంతో ప్రేమ‌లో ప‌డ‌డం ఓ ర‌కంగా కొత్త పాయింటే. 'ల‌వ్ మీ' క‌థంతా ఈ పాయింట్ చుట్టూనే తిర‌గ‌బోతోంది. ఆశిష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన సినిమా ఇది. దిల్ రాజు బ్యాన‌ర్‌లో తెర‌కెక్కించారు. ఈనెల...

2గంటల్లో భారీ వర్షం.. హైదరాబాద్ బీ అలర్ట్..!!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల,రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు భగ్గుమనగా మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా...

ట్యాక్సుల‌పై నిర్మ‌ల‌మ్మ‌కు డైరెక్ట్ పంచ్… వీడియో వైర‌ల్

ఒకే దేశం- ఒకే పన్ను అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సామాన్యుల పాలిట గుదిబండగా మారిందన్న విమర్శలు వస్తుండగా.. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close