ఛ‌త్రప‌తి పెట్టిందెంత‌..? వ‌చ్చింది ఎంత‌?

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ బాలీవుడ్ లో ఛ‌త్ర‌ప‌తితో ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో విడుద‌ల అవ్వ‌డం లేదు. కేవ‌లం హిందీ బెల్ట్ కే ప‌రిమితం. ఈ సినిమాతో.. సాయి శ్రీ‌నివాస్ రేంజ్ బాలీవుడ్ లో ఎలా ఉండ‌బోతోందో తేలిపోనుంది. అయితే… బిజినెస్ ప‌రంగా మాత్రం పెన్ స్టూడియోస్ సంస్థ సంతృప్తిక‌రంగానే ఉంది. ఈ సినిమాకి రూ.45 కోట్ల వ‌ర‌కూ ఖ‌ర్చ‌య్యింది. మ‌రో రూ.5 కోట్లు వ‌డ్డీలు, ప‌బ్లిసిటీ వేసుకొన్నా.. రూ.50 కోట్ల‌యిన‌ట్టు లెక్క‌. ఇవ‌న్నీ నాన్ థియేట‌రిక‌ల్ రైట్స్ రూపంలో వ‌చ్చేశాయి. జీ స్టూడియోస్ సంస్థ ఓటీటీ, డిజిటల్‌, శాటిలైట్ హ‌క్కుల్ని కొనేసింది. అందుకు గానూ రూ.50 కోట్లు ముట్ట‌జెప్పింది. సాయి శ్రీ‌నివాస్‌కి… హిందీలో మంచి మార్కెట్ ఉంది. త‌న తెలుగు డ‌బ్బింగులే రూ.20 కోట్ల వ‌ర‌కూ అమ్ముడుపోతాయి. ఇది హిందీలో చేసిన తొలి స్ట్ర‌యిట్ సినిమా. పైగా.. పెన్ స్టూడియోస్‌కి అక్క‌డ మంచి గుర్తింపు ఉంది. అందుకే.. ఈ రేటు వ‌చ్చింది. థియేట్రిక‌ల్ నుంచి వ‌చ్చిందంతా ఇప్పుడు లాభ‌మే. అందుకే.. సాయి శ్రీ‌నివాస్‌తో మ‌రో రెండు సినిమాల‌కు పెన్ స్టూడియోస్ సంస్థ ఒప్పందం కుదుర్చుకొంది. వ‌చ్చే యేడాది ఓ బాలీవుడ్ ద‌ర్శ‌కుడ్ని బెల్లంకొండ కాంబినేష‌న్‌లో ఓ సినిమా చేయాల‌ని ప్లాన్ చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close