రేవంత్‌ రెడ్ బుక్‌పై తెలంగాణ పోలీసుల కేసులు !

కొంత మంది పోలీసులు బీఆర్ఎస్ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు.. వారందరి పేర్లు రెడ్ బుక్ లో రాస్తున్నాం.. కాంగ్రెస్ రాగానే గుడ్డలిప్పదీస్తం. అసలు, మిత్తీతోని చెల్లిస్తం అని రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్‌లో చేసిన హెచ్చరికలపై పోలీసులు అధికారుల సంఘం నేతలు చెలరేగిపోతున్నారు. ఊరూవాడా ప్రతి పోలీస్ స్టేషన్లలోనూ ఫిర్యాదులు చేస్తున్నారు. తమ మనోభావాలను రేవంత్ రెడ్డి దెబ్బ తీశారని వారి అభియోగం.

పోలీసుల మనోభావాలు దెబ్బతీసిన రేవంత్‌రెడ్డి.. వెంటనే క్షమాపణలు చెప్పాలని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. క్ష మాపణలు చెప్పకపోవడంతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌ నేతలు వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్‌పై కేసులు నమోదయ్యాయి. ఏపీలోనే అనుకుంటే… తెలంగాణ పోలీసు సంఘాలు కూడా రాజకీయంగా యాక్టివ్ అయ్యాయి. పొలిటికల్ వ్యాఖ్యలు చేస్తున్నాయి.

‘రెడ్‌ డైరీ’ అంటే ఏమిటి? అదేమన్నా మీ సొంత రాజ్యాంగమా? .. పోలీసు వ్యవస్థ ప్రభుత్వంలో అంతర్భాగమని, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు శాంతి భద్రతలను కాపాడతామని చెబుతున్నారు. బీఆర్ఎస్ తో కలిసి పోలీసులు పని చేస్తున్నారన్నదానికి వారు టీ పీసీసీ అధ్యక్షునిపై పెడుతున్న కేసులే సాక్ష్యమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రేవంత్ రెడ్డి అందరు పోలీసుల్ని అనలేదని.. బీఆర్ఎస్‌తో కలిసి కాంగ్రెస్ నేతలపై కుట్రలు చేస్తున్న వారిని మత్రమే అంటున్నామని చెబుతున్నారు. మొత్తంగా పోలీసులు వర్సెస్ రేవంత్ అన్నట్లుగా తెలంగాణ రాజకీయం మారిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో ఉద్రిక్తత… రంగంలోకి కేంద్ర బలగాలు..!!

ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పలు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తుతుండటంతో ఈసీ సీరియస్ అయింది. పల్నాడు జిల్లాలో 144సెక్షన్ విధించాలని జిల్లా...

యాక్షన్ లోకి దిగిన హీరోయిన్స్

గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులని ఫిదా చేసే హీరోయిన్స్ యాక్షన్ బరిలో దిగుతున్నారు. హీరోలకు ధీటుగా పోరాటాలు చేస్తూ యాక్షన్ చిత్రాలతో సై అంటున్నారు. ఒకరు తుపాకీ పట్టుకొని బుల్లెట్ల వర్షం కురిపిస్తే.. మరొకరు...

వైసీపీ : 2019లో కాన్ఫిడెన్స్‌కా బాప్ – ఇప్పుడు సైలెంట్

2019లో ఏపీలో ఎన్నికలు మొదటి విడతలోనే పూర్తయ్యాయి. ఎన్నికలు అయిపోయిన మరుక్షణం వైసీసీ రంగంలోకి దిగిపోయింది. అప్పటికే ఈసీ ద్వారా నియమింప చేసుకున్న ఉన్నతాధికారుల అండతో ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారు....

రూ. 21వేల కోట్లు – దోచేస్తారా ?

ఏపీ ప్రభుత్వం దగ్గగర ఇప్పుడు ఇరవై ఒక్క వేల కోట్లుకపైగానే నిధులు ఉన్నాయి . పోలింగ్ కు ముందు ప్రజలఖాతాల్లో వేయాల్సిన పధ్నాలుగు వేల కోట్లతో పాటు ఆర్బీఐ నుంచి తాజాగా తెచ్చిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close