ట్విట్ట‌ర్లో ప్రియ‌మ‌ణి సంచ‌ల‌నం

ప్రియ‌మ‌ణి వార్త‌ల్లోకి ఎక్కింది. ఈసారి వాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి అడ్డంగా బుక్క‌య్యింది. ”ఈ దేశంలో మ‌హిళ‌ల‌కు ఏమాత్రం సేఫ్టీ లేదు.. మ‌రో దేశం చూసుకోవాల్సిందే” అంటూ ప్రియ‌మ‌ణి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు పెద్ద దుమారం రేకెత్తిస్తున్నాయి. ”ప్రియ‌మ‌ణి దేశ‌ద్రోహి, యాంటి ఇండ‌య‌న్‌” అంటూ నెటింజ‌న్లు ఎదురుదాడికి దిగారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే… కేర‌ళ‌లో లేటెస్టుగా నిర్భ‌య‌లాంటి సంఘ‌ట‌న జ‌రిగింది. జిషా అనే అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపేశారు. ఈ ఉదంతంపై ప్రియ‌మ‌ణి చ‌లించిపోయి.. ట్విట్ట‌ర్లో త‌న సానుభూతి వ్య‌క్తం చేసింది. అయితే.. ఇండియా అమ్మాయిల‌కు సేఫ్ కాదు అన‌డ‌మే.. నెటింజ‌న్ల‌కు కోపం తెప్పించింది.

అయితే వెంట‌నే ప్రియ‌మ‌ణి తేరుకొని ‘నా మాట‌ల వెనుక ఉన్న అర్థాన్ని గ‌మ‌నించండి’ అంటూ విన్న‌వించుకొంటోంది. అయితే.. ఆమెపై ఎదురుదాడి చేస్తున్న‌వాళ్ల సంఖ్య క్ష‌ణ క్ష‌ణానికీ పెరుగుతోంది. మ‌రి ప్రియ‌మ‌ణి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. జ‌రిగింది ఘోర‌మైన సంఘ‌ట‌నే. ఈ విష‌యంలో ఓ అమ్మాయిగా స్పందించింది ప్రియ‌మ‌ణి. కాక‌పోతే.. కామెంట్ చేసేట‌ప్పుడు కాస్త ఆచి తూచి స్పందిస్తే మంచిది. లేదంటే ఇలాంటి చిక్కులు త‌ప్ప‌వు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సైలెంట్‌గా సర్దేసుకుంటున్న వైసీపీ నేతలు

వైసీపీ నేతలు అటెన్షన్ డైవర్షన్ లో రాటుదేలిపోయారు. ఈ విషయాన్ని మరోసారి నిరూపిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి రోజు మీడియా ముందుకు వచ్చి గెలుస్తాని నీరసంగా చెబుతున్నారు. అయితే అసలు స్కెచ్ మాత్రం వేరే...

లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆలస్యం…?

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యంగా జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం జూన్ చివరి వారంలోనే నిర్వహించాలనుకున్న రిజర్వేషన్ల అంశం ఎటూ తేలకపోవడంతో ఎన్నికలకు రెండు నెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు...

కేబినెట్ విస్తరణ…రేసులో ఉన్నది వీరే..!?

తెలంగాణలో కేబినెట్ విస్తరణపై సందిగ్ధం నెలకొంది. మొదట లోక్ సభ ఎన్నికల తర్వాత ఖాళీగా ఉన్న ఆరు బెర్త్ లను భర్తీ చేస్తారని ప్రకటించినా ఇప్పుడు ఆ ఇష్యూ చర్చ రాకపోవడంతో కేబినెట్...

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close