ప్రత్యేకహోదాపై లోక్‌సభలో ఆకట్టుకున్న మేకపాటి ప్రసంగం

హైదరాబాద్: ప్రత్యకహోదాపై ఆలస్యంగా మేలుకున్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు బాగానే ఉద్యమిస్తున్నారు. ఇవాళ లోక్‌‌సభలో ఈ అంశంపై యాగీ చేసి మొత్తానికి సభ దృష్టిని తమవైపుకు తిప్పుకున్నారు. మొదట ప్రత్యేకహోదాపై వాయిదాతీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే స్పీకర్ సుమిత్రా మహాజన్ దానిని తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యలు ప్లకార్డులు పట్టుకుని పోడియాన్ని చుట్టుముట్టి ప్రత్యేకహోదా కోరుతూ నినాదాలు చేశారు. రాజ్‌నాథ్ దీనిపై సమాధానం ఇవ్వటంతో వైసీపీ సభ్యులు సీట్లలోకి వెళ్ళి కూర్చున్నారు. తర్వాత ఈ అంశంగురించి వైసీపీ సీనియర్ నాయకుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని, కేంద్రం ఆదుకోవాలని అన్నారు. తమను ప్రజలు ఎక్కడకెళ్ళినా ఇదే అంశంపై అడుగుతున్నారని, తాము ముఖం చూపించుకోలేకపోతున్నామని చెప్పారు. ప్రత్యేకహోదా సాధించలేకపోతే ప్రజలు తమను క్షమించరని అన్నారు. రాష్ట్రాన్ని మళ్ళీ పునాదులదగ్గరనుంచి నిర్మించుకోవాల్సి ఉందని చెప్పారు. ఈ అంశంపై ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రధాని లోక్‌సభలో దీనిపై గతంలో హామీ ఇచ్చారని, ఎన్‌డీఏ కూటమి తమ మ్యానిఫెస్టోలో వాగ్దానం చేసిందని మేకపాటి చెప్పారు. కేంద్రప్రభుత్వం దీనిపై స్పష్టంగా, వివరంగా ఒక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మొత్తంమీద, రాజకీయాలను పక్కన పెడితే ప్రత్యేకహోదాపై ఆంధ్రప్రదేశ్ గళాన్ని పార్లమెంట్‌ వేదికగా వినిపించటంలో మేకపాటి కృతకృత్యులయ్యారని చెప్పాలి. ఆయన వాదనలో నిజాయితీ, ఆవేదన కనిపించింది.

మరోవైపు మేకపాటి తర్వాత మాట్లాడిన తెలుగుదేశం ఎంపీ ఈ అంశాన్ని రాజకీయం చేయాలని ప్రయత్నించారు. తమపార్టీ అధినేత చంద్రబాబు ప్రత్యేకహోదాకోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్, వైసీపీ కలిసిరావటంలేదని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలు దీనిపై గతంలో హామీ ఇచ్చికూడా ఇప్పుడు మాట్లాడటంలేదని అన్నారు. వైసీపీ ఇప్పటికైనా దీనిపై మాట్లాడటం సంతోషమని అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

గాజు గ్లాస్ జనసేనకు మాత్రమే !

వైసీపీ నేతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇండిపెండెంట్లుగా తమ వారిని నిలబెట్టి వారికి గాజు గ్లాస్ గుర్తు ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. గాజుగ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేస్తూ...

ఓటేస్తున్నారా ? : ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి తెలుసుకోండి !

ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏముందిలే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close