తల్లికి వందనం రూ.పదమూడు వేలు అమ్మల ఖాతాల్లో పడ్డాయి. ఇది వైసీపీకి కడుపు మంటగా ఉంది. రెండు వేలు స్కూల్ మెయిన్టనెన్స్ కోసం ఖర్చు పెట్టనున్నారు. వైసీపీ హయాంలోనూ ఇదే చేశారు. ప్రభుత్వం పదమూడు వేలు అని చెబుతోంది. కానీ వైసీపీ నేతలు తాము ఇప్పటికీ పదిహేను వేలు ఇచ్చామని చెబుతున్నారు. అయినా ఆ రెండు వేలు లోకేష్ ఖాతాలో పడ్డాయని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ట్వీట్లు చేస్తున్నారు. కానీ తాము కూడా పదమూడు వేలే ఇచ్చామని.. ఆ రెండు వేల లెక్కలు చెప్పాలని అడుగుతారన్న ఇంగిత జ్ఞానానికి రాలేకపోయారు.
ఇప్పుడు తల్లికి వందనంలో రెండు వేలు నారా లోకేష్ ఖాతాలో పడి ఉంటే.. నాలుగేళ్ల పాటు ఆ మొత్తం ఖచ్చితంగా జగన్ రెడ్డి ఖాతాలో పడినట్లేగా. ఇప్పుడు వాటికి లెక్కలు చెప్పాలని ప్రభుత్వం ఎంక్వయిరీ కమిటీ వేస్తే ఏం చేస్తారు?. కక్షసాధింపులని ఏడ్చి ఏడ్చి రంకెలు వేస్తారు. జగన్ రెడ్డి అమ్మ ఒడి పేరుతో ఘోరమైన మోసం చేశారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ అమ్మఒడి ఇస్తామని మభ్యపెట్టారు. చివరికి ఎంత మంది ఉన్నా ఒక్కరికే ఇచ్చారు. ఇప్పుడు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తున్నారు. ఈ పాజిటివ్ నెస్ ను జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ తట్టుకోలేకపోతోంది.
ఆ రెండు వేలు ఎల్ ట్యాక్స్ అని ప్రచారం చేస్తూంటే.. నారా లోకేష్ నేరుగానే సవాల్ చేశారు. ఇరవై నాలుగు గంటల్లో ఆధారాలు చూపించాలన్నారు. కానీ వైసీపీ నేతలకు సిగ్గూ, ఎగ్గూ ఉండదని టీడీపీ నేతలు చేసే ఆరోపణల్ని వారు నిజం చేస్తూంటారు. ఒక్క రిప్లయ్ ఇవ్వకుండా.. మళ్లీ అదే ట్వీట్ చేశారు. బురత చల్లేసి తుడుచుకోమని చెప్పడమన్నమాట. ఇప్పటికే ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను వైసీపీ మరింతగా పెంచుకుంటోంది. అమ్మఒడి కన్నా ఎక్కువగా.. తల్లికి వందనం ఇప్పుడు ప్రజల్ని మెప్పించింది.