హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో ఉన్న మహాన్యూస్ టీవీ చానల్ , కార్యాలయంపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. సడెన్గా గుంపులా వచ్చి.. కార్యాలయంపై విరుచుకుపడ్డారు. ఆఫఈసు ఎదురుగా ఉన్న కార్లతో పాటు .. కార్యాలయం లోపలుకు చొచ్చుకు వెళ్లి దాడి చేశారు. రిసెప్షన్ తో పాటు స్టూడియోను కూడా ధ్వంసం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తల దాడితో ఉద్యోగులంతా భయాందోళనకు గురయ్యారు. దాడి చేయడానికే వచ్చినట్లుగా ధ్వంసం చేసేసి ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు.
ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేటీఆర్ పై మహాన్యూస్ లో అభ్యంతరకర విషయాలు వస్తున్నాయని బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఈ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోవడంతో ఇలా దాడి చేస్తారని మహా న్యూస్ వర్గాలు కూడా అనుకోలేదు. దాంతో పెద్దగా సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసుకోలేదు. దాంతోదాడి చేసిన వారికి ఎలాంటి అడ్డంకులు లేకుండా పోయినట్లయింది.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు క్యూ న్యూస్ తో పాటు పలు మీడియా సంస్థలపై దాడులు చేశారు. అప్పట్లో పోలీసులు ఇలా దాడులు చేసిన వారిని పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దాడులు చేస్తే.. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు. మహాన్యూస్ పై దాడి చేసిన వారిపై పోలీసులు కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టులు చేసే అవకాశాలు ఉన్నాయి.