ఆంధ్రప్రదేశ్లో నవంబర్ నుంచి విద్యుత్ బిల్లులు తగ్గిస్తున్నారు. యనిట్కు 13 పైసలు చొప్పున వెనక్కి తిరిగి ఇవ్వనున్నారు. ఇలా ఆరేడు నెలల పాటు తగ్గించే అవకాశం ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లుగా విద్యుత్ కొనుగోళ్లు చేసింది. యూనిట్ కు పదిహేను రూపాయల వరకూ కొనుగోలు చేసింది. ఆ భారం అంతా ట్రూ అప్ల పేరుతో ప్రజలపైనే రుద్దింది. ఇప్పుడు ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లను నియంత్రించింది. ఈ కారణంగా ప్రజల నుంచి వసూలు చేసిన రూ. 923 కోట్లను ట్రూ డౌన్ పేరుతో తిరిగి వారికే సర్దుబాటు చేయాలని నిర్ణయించింది.
జగన్ రెడ్డి వారు నాయకత్వం వహించే బాధ్యత లేని ప్రభుత్వాలు ప్రజాధనమే కదా అని ఇష్టం వచ్చినట్లుగా విద్యుత్ కొనుగోళ్లు చేస్తాయి. వాటిని ట్రూ అప్ అని.. ఎఫ్ఎస్ఎస్ఏ అని రకరకాల పేర్లు పెడతాయి. దాంతో బిల్లు చాంతాడు అంత అవుతుంది. వైసీపీ హయాంలో చేసిన తప్పిదాల వల్ల వారు పోతూ పోతూ తర్వాత కూడా బిల్లులు పెరిగేలా ట్రూ అప్ చార్జీలను పెంచి పోయారు. కూటమి ప్రభుత్వం వచ్చినా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ అప్పటికే నిర్ణయం తీసుకోవడంతో ఆపలేకపోయారు.
అయితే ఆ తప్పుల్ని సరిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పుడు ప్రజలు కట్టిన ట్రూ అప్ బిల్లుల్లో రూ. 923 కోట్లను వారికే తిరిగి చెల్లించనుంది. పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు తక్కువ ధరలకు విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల ఆదా అయిన మొత్తాన్ని వినియోగదారులకు తిరిగి అందిస్తున్నారు. దీన్ని “ట్రూ-డౌన్ చార్జెస్”గా పిలుస్తున్నారు. ఇది దేశంలోనే ఒక అరుదైన విషయం అనుకోవచ్చు. సాధారణంగా, విద్యుత్ కంపెనీలు టారిఫ్లను పెంచడానికి “ట్రూ-అప్” చార్జీలను విధిస్తాయి. అయితే, ఈ సందర్భంలో “ట్రూ-డౌన్” చార్జీల ద్వారా ఆదా అయిన మొత్తాన్ని వినియోగదారులకు తిరిగి ఇవ్వడం దేశంలోనే మొదటిసారి అనుకోవచ్చు.
రూ.923 కోట్లను రాష్ట్రంలోని సుమారు కోటిన్నర కోట్ల గృహ వినియోగదారులకు పంపిణీ చేస్తారు. ఈ నిధులు వినియోగదారులకు కరెంట్ బిల్లులలో సర్దుబాటు రూపంలో తిరిగి చెల్లిస్తారు. యూనిట్ కు రూ.13 పైసల చొప్పున తగ్గించే అవకాశం ఉంది. ననంబర్ నుంచి సర్దుబాటు చేస్తారు.