ఇప్పుడు బంతి పాక్ కోర్టులో ఉంది..ఏమి చేయబోతోందో?

పాక్ భూభాగంలో భారత్ సైనికులు చేపట్టిన ‘సర్జికల్ స్ట్రయిక్స్’ ని చూసి భారత్ ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. సంబరాలు చేసుకొంటున్నారు. ఇన్నేళ్ళుగా వారిలో పాక్ పట్ల పేరుకున్న ఆగ్రహావేశాలు ఈవిధంగా బయటపడుతున్నాయని చెప్పవచ్చు. ఈ సాహసోపేతమైన మిలటరీ ఆపరేషన్ ద్వారా భారత ప్రభుత్వం తన ప్రజల అహాన్ని చల్లార్చించిందని చెప్పవచ్చు. భారత ప్రభుత్వం ఏవిధంగా తన ప్రజల, సైనికుల అహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకొందో, ఇప్పుడు పాక్ ప్రభుత్వం కూడా అదేవిదంగా తన ప్రజల, సైనికుల అహాన్ని చల్లార్చవలసి ఉంటుంది. లేకుంటే భారత్ ఒక చిన్న దాడి చేస్తేనే, ఇంతకాలం ప్రగల్భాలు పలికిన పాక్ పాలకులు, సైన్యం చేతకాని దద్దమ్మలలాగ చేతులు ముడుచుకొని కూర్చోన్నారని పాక్ ప్రజలు, ప్రతిపక్షాలు నిందించవచ్చు. ఇప్పటికే నిందిస్తున్నారు కూడా. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్ తో చాలా అసమర్ధంగా, పిరికితనంతో వ్యవహరిస్తున్నారని మాజీ క్రికెటర్, పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ఎద్దేవా చేశారు. భారత్ కి ఏవిదంగా ధీటుగా జవాబు చెప్పాలో తాను నవాజ్ షరీఫ్ కి ఈరోజు చెపుతానని అన్నారు. ఇవ్వాళ్ళ పాకిస్తాన్ లో ఆయన బారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు.

పాక్ లో ప్రతిపక్షాలు, మీడియా, ప్రజలు కూడా ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. దానితో పాక్ ప్రభుత్వం కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. కనుక పాక్ నుంచి ఏదో రూపంలో ప్రతీకార చర్య తప్పక ఉంటుంది. దానికి భారత్ ప్రభుత్వం, సైన్యం, యావత్ భారతీయులు సిద్దంగా ఉండక తప్పదు. ఒకవేళ అంతర్జాతీయ ఒత్తిళ్ళ కారణంగా భారత్ పై ప్రత్యక్షంగా యుద్దానికి దిగకపోయినా, పాకిస్తాన్ కి మరో సైన్యం వంటి ఉగ్రవాదులు భారత్ పై విరుచుకు పడటం ఖాయం. సరిహద్దులు దాటి వచ్చి దాడులు చేసేవారిని ఎదుర్కోవడానికి భారత్ సైన్యం సంసిద్దంగా ఉంది. కానీ ఇంటి దొంగలతోనే అసలైన ప్రమాదం. కనుక దేశ ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ చాలా అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వృద్ధుల ప్రాణాలతో రాజకీయం – ఇంత క్రూరమా ?

ఏపీ ప్రభుత్వానికి వృద్ధులను ఎంత హింసిస్తే అంత మంచి రాజకీయం అనుకుంటున్నారు. వాళ్లు ఎంత బాధపడితే అంతగా చంద్రబాబును తిట్టుకుంటారని ఊహించుకుంటూ వాళ్లను రాచి రంపాన పెడుతున్నారు. ఇంటింటికి పంపిణీ చేసేందుకు...

ఓటేస్తున్నారా ? : ఏపీ రాజధానేదో ఒక్క సారి గుర్తు తెచ్చుకోండి !

పాలకుడు సొంత రాష్ట్రంపై కుట్రలు చేసుకునేవాడు అయి ఉండకూడదు. సొంత ప్రజల్ని నాశనం చేసి తాను ఒక్కడినే సింహాసనంపై కూర్చుని అందర్నీ పీల్చి పిప్పి చేయాలనే వ్యక్తిత్వం ఉండకూడదు. అలా ఉంటే...

ఎడిటర్స్ కామెంట్ : గుర్తుకొస్తున్నావయ్యా.. శేషన్ !

టీ.ఎన్.శేషన్. ఈ పేరు భారత్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా స్మరించుకుంటూనే ఉన్నారు. గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. కానీ ఆయనను మరిపించేలా మాత్రం ఎవరూ రావడం లేదు. ఎన్నికల సంఘం...

నిప్పుల కుంపటిలా తెలంగాణ..

తెలంగాణ నిప్పుల కొలిమిలా మారింది. రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు మరింత ముదురుతున్నాయి. భానుడు ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరో నాలుగైదు రోజులపాటు వేసవి తీవ్రత ఇలాగే ఉంటుందని.. ఎండతోపాటు వడగాడ్పులు వీస్తాయని వాతావరణ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close