వీహెచ్‌కు పవన్‌పై ఎందుకంత ప్రేమ!

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ ఆదివారంనాడు అమరావతి ప్రాంతానికి వెళ్ళి రైతులతో సమావేశమవటంపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ వి.హనుమంతరావు తెగ సంతోషపడిపోతున్నారు. పవన్ ప్రజలలోకి వెళ్ళి వారి సమస్యలను తెలుసుకోవటం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని చెప్పారు. నాయకుడు అన్నవాడు ప్రజలలో తిరగాలని, ప్రజల ఇబ్బందులపై స్పందించినవాడే నిజమైన నాయకుడు అని కొనియాడారు. ప్రజల సమస్యలపై పవన్ నిత్యం ఇలాగే స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని చాలా అవసరమని, అయితే ఏపీ ప్రభుత్వం దారుణంగా రైతుల భూములు లాక్కుంటోందని విమర్శించారు. రైతుల ఇష్టాయిష్టాలను పరిగణనలోకి తీసుకోకుండా ముఖ్యమంత్రి బలవంతంగా భూములను లాక్కోవటం ఏమాత్రం మంచిదికాదని అన్నారు. పవనేమో జనసేన పార్టీ అధినేత, తెలుగుదేశం, భారతీయజనతా పార్టీలకు మిత్రపక్ష నేత. వీహెచ్ కాంగ్రెస్ నాయకుడు. మరి పవన్‌పై వీహెచ్‌కు ఈ ప్రేమ ఎందుకో అర్థం కావటంలేదు. ఇంతకుముందుకూడా ఓటుకు నోటు కేసులో పవన్ స్పందించటంలేదని, ఆయన స్పందించకపోతే ఇంటిముందు ధర్నాకు దిగుతానని వార్నింగ్ ఇచ్చారు. రెండురోజుల క్రితం పవన్ అమరావతి వెళ్ళి రైతులను కలుసుకోవాలని డిమాండ్ చేశారు. పరోక్షంగా వీహెచ్ పవన్‌కు దిశానిర్దేశం చేస్తున్నట్లుగా ఉంది ఈ వ్యవహారం. గాంధీ కుటుంబానికి వీర విధేయుడైన వీహెచ్ ఒకవేళ పవన్‌కు వీరాభిమానేమో!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close