మళ్ళీ తాత్కాలిక రాజధాని ఆలోచన!

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ లో పనిచేస్తున్న తన ఉద్యోగులను, కార్యాలయాలను విజయవాడకు తరలించాలనుకొంటోంది. అంచెలంచెలుగా ఉద్యోగులను కార్యాలయాలను అన్నీ ఒకేసారి విజయవాడకి తరలించాలని భావిస్తుండటంతో ఒకేసారి అన్నివేళ మంది ఉద్యోగులకి వసతి, కార్యాలయాల ఏర్పాటుకి అవసరమయిన భవన సముదాయాల కోసం వెతుకులాట సాగుతోంది. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు చేయడం కోసం గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ భవనాలన్నిటినీ ఉపయోగించుకొన్నా ఇంకా చాలా భవనాలు అవసరం ఉంది. ఇక వేలమంది ఉద్యోగులకు నివాసాలను ఏర్పాటు చేయడం ఇంకా పెద్ద సమస్య. కనుక ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఇదివరకు పక్కన పడేసిన తాత్కాలిక రాజధాని నిర్మాణం ప్రతిపాదనను మళ్ళీ అమలుచేసేందుకు రంగం సిద్దం చేస్తోంది. అందుకోసం విజయవాడ-గుంటూరు పట్టణాల మధ్యన హైవేకి దగ్గరలో హరిహాంత్ అనే ప్రైవేట్ సంస్థకు చెందిన 23ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడానికి నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు బదులుగా ఆ సంస్థకు నవులూరు వద్ద స్థలం కేటాయిస్తోంది. ఆ సంస్థ నుంచి స్వాధీనం చేసుకొన్న ఆ ప్రాంతంలో తాత్కాలిక ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయబోతోంది.

ఇంతకు ముందు హైదరాబాద్ నుండి అమరావతికి ప్రభుత్వ ఉద్యోగులను, కార్యాలయాలను తరలించాలని భావించినప్పుడు అందుకోసం ప్రీ-ఫ్యాబ్రికేటడ్-పద్దతిలో తాత్కాలిక నగరాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావించింది. దానికోసం సుమారు మూడు వందల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అది చూసి ప్రభుత్వం పునరాలోచనలో పడింది. హైదరాబాద్ లో మరో తొమ్మిదేళ్ళు ఉండేందుకు అవకాశం ఉంది. పైగా ఉద్యోగులు కూడా విజయవాడకి తరలి వచ్చేందుకు విముఖత చూపుతున్నారు. మరొక రెండేళ్ళలో శాశ్విత రాజధానిలో భవనాలు సిద్ధమయ్యే అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ వందల కోట్లు ఖర్చు చేయడం, శాశ్విత రాజధాని ఏర్పడిన తరువాత వందల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఆ భవనాలన్నిటినీ మళ్ళీ తొలగించడానికి భారీగా ఖర్చవుతుంది. తొలగించకపోతే అవి నిరుపయోగంగా మారుతాయి. అందుకే ప్రభుత్వం ఆ ప్రతిపాదనని పక్కన పడేసింది. కానీ మళ్ళీ ఇప్పుడు అంత కాకపోయినా ఎంతో కొంత ఖర్చు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకొన్న ఆ 23ఎకరాల స్థలంలో తాత్కాలిక రాజధాని నిర్మించడానికి సిద్దం అవుతున్నట్లుంది. మరి దానికి ఎన్ని కోట్లు ఖర్చు చేయబోతోందో? చూడాలి.

ఫోన్ ట్యాపింగ్స్ తో ఉక్కిరిబిక్కిరి అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకా హైదరాబాద్ లోనే ఉంటే ఎన్ని సమస్యలు వస్తాయో…అనే భయంతోనే ఇంత హడావుడిగా విజయవాడకు తరలిపోవాలనుకొంటున్నరేమో? ఉద్యోగులు వచ్చినా రాకపోయినా ఆయన మాత్రం ఇప్పుడు వారానికి ఐదురోజులు విజయవాడలోనే గడుపుతున్నారు. ఇంతకు ముందు ఆంద్రప్రదేశ్ ప్రజలు ఎంతగా బ్రతిమాలినా రాష్ట్రానికి రాని ప్రభుత్వం కేసీఆర్ కొట్టిన దెబ్బకి ఒకేసారి తరలివచ్చేస్తున్నట్లుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close