ప్రముఖ కన్నడ సాహితీవేత్త కలబుర్గి హత్య

ప్రముఖ కన్నడ సాహితీవేత్త ఎం.ఎం.కలబుర్గి (77)ని గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు నిన్న హత్య చేసారు. నిన్న ఉదయం ధార్వాడలోని ఆయన ఇంటి ఆవరణలో వాకింగ్ చేస్తున్న సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అతిసమీపం నుండి ఆయనను తుపాకీతో కాల్చి చంపి బైక్ పై పారిపోయారు. అయన నుదురు, కంట్లో నుండి రెండు బుల్లెట్లు దూసుకుపోవడం మరణించారు. ఆయనని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనని రక్షించే ప్రయత్నాలు ఫలించకపోవడంతో మరణించారు. 1962 నుండి అద్యాపకుడిగా జీవితం ఆరంభించిన ఆయన తన ప్రతిభాపాటవాలతో అంచలంచెలుగా ఎదుగుతూ హంపీ విశ్వవిద్యాలయానికి ఉపకులపతి స్థాయిలో సేవలందించారు. కన్నడ సాహితీ రంగంలో ఆయన సాహితీవేత్తగా మంచి పేరుంది. సాహితీ రంగంలో ఆయన రచనలకు గుర్తింపుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, కన్నడ సాహితీ పురస్కారం, పంపా అవార్డు తదితర అనేక పురస్కారాలను అందుకొన్నారు. అటువంటి ప్రముఖ సాహితీ వేత్త ఇంత దారుణంగా హత్యకు గురి కావడంతో యావత్ కన్నడ సాహితీ ప్రియులు, ప్రజలు చాలా దుఃఖిస్తున్నారు. రాళ్ళు, రప్పలకు పూజలు చేయవద్దని ఆయన ఉద్భోదిస్తుండేవారు. కనుక హిందూ మత ఛాందసవాదులేవరో ఆయనను హత్య చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కలబుర్గికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

ఏడు మండలాలు కాదు. ఐదు గ్రామాలే అంటున్న కాంగ్రెస్ !

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోల ఐదు గ్రామాల ప్రస్తావన తీసుకు వచ్చింది. ఏపీలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలుపుతామని ప్రకటించింది. దీంతో కొత్త వివాదం ప్రారంభమయింది. ఇది ఓ రకంగా గట్టు తగాదా...

నిరాసక్తంగా జగన్ ప్రచారం – ఆశలు వదిలేసుకున్నట్లే !

ఏపీ సీఎం జగన్ ప్రచారానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. రెండు, మూడు రోజులకో సారి తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమవుతున్నారు. ప్రచార సభల్ని పరిమితం చేసుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్...

ఒంగోలు లోక్‌సభ రివ్యూ : డబ్బుతొ గెలిచేస్తానని చెవిరెడ్డి లెక్కలు

ఒంగోలు ఎంపీ సీటు హాట్ కేకులా మారింది. ఆగర్భ శ్రీమంతుడైన మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తూండగా.. ఎన్నికల అఫిడవిట్‌లోనూ పెద్దగా ఆస్తులు,. ఆదాయం చూపించలేని చెవిరెడ్డి భాస్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close