కళ్యాణ్‌రామ్ ‘షేర్‌’లో టీడీపీ ప్రభుత్వంపై సెటైర్

హైదరాబాద్: నందమూరి కళ్యాణరామ్ తదుపరి చిత్రం ‘షేర్‌’ విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఆ చిత్రం ఆడియో గత శనివారం జూనియర్ ఎన్‌టీఆర్ చేతులమీదుగా విడుదలయింది. ఈ సందర్భంగా విడుదల చేసిన షేర్ ట్రైలర్‌లో తెలుగుదేశం ప్రభుత్వంపై ఒక సెటైర్ డైలాగ్ ఉండటం సంచలనం సృష్టిస్తోంది. నందమూరి అభిమానుల్లో ఇది పెద్ద చర్చనీయాంశమయింది.

సెటైర్ డైలాగ్ వివరాలు ఇలా ఉన్నాయి. ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ ఫేమ్ పృథ్వీ ఒక డైలాగ్ చెబుతారు. “పోలవరం ప్రాజెక్ట్, వీడి పెళ్ళి జరిగినట్టే ఉంటాయి, కానీ జరగవు చిరాగ్గా”. ఈ డైలాగ్ నేరుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నివిమర్శించినట్లే ఉంది. పోలవరం ప్రాజెక్ట్‌పై ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం జోరుగా ఆరోపణలు, ప్రత్యారోపణలు నడుస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్, వైసీపీ వంటి ప్రతిపక్షాలతోపాటు, మిత్రపక్షం బీజేపీ కూడా ఇప్పటికే తీవ్ర విమర్శలు చేస్తోంది. ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్‌ పనులను పక్కనపెట్టిందని, బిల్లులుమాత్రం పెట్టి కేంద్రంనుంచి నిధులు రాబట్టుకుంటోందని బీజేపీ నేతలు ఇటీవల ఆరోపణలుకూడా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశానికే చెందిన, అందునా నందమూరి వంశానికి చెందిన కుటుంబంనుంచి వచ్చే ‘షేర్’ సినిమాలో పోలవరంపై వ్యంగ్యాస్త్రం ఉండటం సంచలనమే. మరి ఈ డైలాగ్ కావాలనే పెట్టారో, అవగాహనలేక పెట్టారో తెలియటంలేదు. అవగాహన లేక పెట్టి ఉంటే మాత్రం ఎవరైనా అప్రమత్తం చేస్తే విడుదలనాటికైనా తీసేస్తారు. విడుదలైన చిత్రంలో ఈ డైలాగ్ ఉందంటే కావాలనే పెట్టినట్లు అర్థం చేసుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close