దేశాధ్యక్షుడిపై ఉపాధ్యక్షుడు హత్యా ప్రయత్నం!

మాల్దీవుల అధ్యక్షుడు యమీన్ అబ్దుల్ గయూమ్ పై హత్యా ప్రయత్నం చేసినట్లు అనుమానిస్తూ ఆ దేశ ఉపాధ్యక్షుడు అహ్మద్ అదీబ్ ను ఈరోజు ఉదయం మాల్దీవుల పోలీసులు మాల్దీవుల విమానాశ్రయంలో అరెస్ట్ చేసారు. మాల్దీవుల అధ్యక్షుడు యమీన్ అబ్దుల్ గయూమ్ తన భార్యతో కలిసి సౌదీ అరేబియాలో హజ్ యాత్ర చేసుకొని సెప్టెంబర్ 28వ తేదీన మాల్దీవుల విమానాశ్రయం నుంచి రాజధాని మాలెకు తన స్పీడ్ బోటులో తిరిగివస్తుంటే అందులో అమర్చిన బాంబు పేలింది. ఆ ప్రేలుడులో అధ్యక్షుడు ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన భార్య, అంగరక్షకుడు గాయపడ్డారు. ఆ సంఘటనపై దర్యప్తు చేసిన పోలీసులు దానిలో ఉపాధ్యక్షుడు అహ్మద్ అదీబ్ హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈరోజు ఆయన తన చైనా పర్యటన ముగించుకొని మాల్దీవుల విమానాశ్రయంలో దిగగానే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close