రావుల సన్నాయి నొక్కులు

వరంగల్ లోక్ సభ నియోజక వర్గానికి ఎన్నికల షెడ్యూల్ జారీ అవడంతో తెలంగాణాలో అన్ని రాజకీయ పార్టీలలో హడావుడి మొదలయింది. మిత్రపక్షాలుగా ఉన్న తెదేపా, బీజేపీలు ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టాలని సూత్రప్రాయంగా అంగీకరించాయి. అయితే ఎన్నికల షెడ్యూల్ జారీ అయ్యేక రెండు పార్టీలలో అభ్యర్ధులు తమకే అవకాశం ఇవ్వాలని ఒత్తిడి చేస్తుండటంతో సమస్య మొదలయింది.

తెదేపా పాలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ మెల్లగా సన్నాయి నొక్కులు నొక్కడం ప్రారంభించారు. తమ పార్టీలో కార్యకర్తలు తననే వరంగల్ ఉప ఎన్నికలలో పోటీ చేయమని కోరుతున్నారని కనుక తనకు అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసారు. మెదక్ ఉప ఎన్నికలలో, ఆ తరువాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ పార్టీ బీజేపీకి మద్దతు ఇచ్చింది కనుక మిత్రధర్మం పాటించి ఈ సీటుని తనకే వదిలిపెట్టాలని ఆయన బీజేపీని కోరుతున్నారు. ప్రజలలో తెరాసపై నమ్మకం, ఆశలు సన్నగిల్లాయని, కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయిందని రావుల చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. ఇటువంటి తరుణంలో తనకు అవకాశం కల్పించినట్లయితే ఈ ఎన్నికలలో తప్పకుండా విజయం సాధించగలనని అన్నారు. అయితే బీజేపీ నేతలు కూడా తమ పార్టీ తరపున ఎవరిని అభ్యర్ధిగా నిలబెట్టాలనే విషయంపై చర్చించేందుకు ఈరోజు సమావేశమయ్యారు. అనంతరం వారు తెదేపా నేతలతో సమావేశమయ్యి చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకొంటారు. ఆ రెండు పార్టీలు మాట్లాడుకొని రేపు తమ అభ్యర్ధిని ప్రకటించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close