అభిప్రాయం మాత్రం అమరావతి..! రిపోర్ట్ ఏం ఇస్తారో..?

అమరావతిని మార్చాలనుకుంటున్న ఏపీ సర్కార్ దాని కోసం.. కొద్ది రోజులుగా చిత్రవిచిత్రమైన విన్యాసాలు చేస్తోంది. అందులో భాగంగా… ముంపు నుంచి ఖర్చు ఎక్కువ వరకు.. చాలా ప్రకటనలు చేసింది. ఆ తర్వాత మాజీ ఐఏఎస్ అధికారి జీఎన్ రావు కన్వీనర్ గా వివిధ రంగాల నిపుణులతో కమిటీ నియమించింది. ఆ కమిటీ సిఫార్సు మేరకు రాజధాని ఉంటుందని మంత్రి బొత్స చెబుతూ వస్తున్నారు. ఈ జీఎన్ రావు కమిటీ గత నెల రోజులుగా రాష్ట్రంలో పర్యటించింది. అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆన్ లైన్ లో కూడా తమ అభిప్రాయాలను పంపించాలని కమిటీ సూచించటంతో వేలాది సూచనలు ఈ కమిటీకి అందాయి. ఇందులో దాదాపుగా 65 శాతం వరకు రాజధానిని రాష్ట్రం మధ్యలోనే కొనసాగించాలని సూచించారు. ఉత్తరాంధ్ర, కోస్తా నుంచి ఇటువంటి సూచనలు ఎక్కువగా వచ్చాయి.

రాయలసీమ నుంచి మాత్రం హైకోర్టును ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కొందరు, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని మరికొందరు, ప్రకాశం జిల్లా నుంచి దొనకొండలో రాజధానిని ఏర్పాటు చేయాలని ఇంకొందరు సూచనలు పంపినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా 30వేల మందికిపైగా ఈమెయిల్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాజధానికి రైతులు కూడా కమిటీని తమ వాదనలను వినిపించారు. తాము తెలుగుదేశం పార్టీని చూసి భూములివ్వలేదని… తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతోనే భూములు స్వచ్ఛందంగా ఇచ్చామని రైతులు కమిటీకి తెలియచేశారు. రాజధాని ఒక సామాజికవర్గానికి పరిమితమని కొంతమంది వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాంపట్ల రైతులు లేఖ రూపంలోనే అసంతృప్తి తెలియచేశారు.

రాజధానిలోనే అభివృద్ధి పరిమితం కాకుండా వికేంద్రీకరణ జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ప్రధానంగా రాజధానిపైనే దృష్టికేంద్రీకరించింది. ఇప్పటికే పలు నిర్మాణాలు ప్రారంభం కావడంతో వీటిని ఏం చేయాలి, రైతుల వద్ద నుంచి 33 వేల ఎకరాల భూములను తీసుకోవటం, వారికి ఇప్పటికే ఐదేళ్లు కౌలు కూడా ఇచ్చేయటం, రైతుల భూముల్లో ప్లాట్లు కూడా వేసి వేరే రైతులకు రిజిస్ట్రేషన్లు చేయటంతో ఇప్పుడు రైతుల పరిస్థితి ఏమిటనేది రాష్ట్ర ప్రభుత్వానికి అంతుబట్టని సమస్యగా మారింది. దీనికి కమిటీ ఎలాంటి పరిష్కారం చూపిస్తుందోనన్నది ఆసక్తికరంగా మారింది. నివేదిక ప్రభుత్వానికి అందిన తర్వాత ఓ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close