ఏపీ గవర్నర్‌ను ఢిల్లీకి పిలిచారా..!?

ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ను కేంద్రం ఢిల్లీకి పిలిపించిందని… కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. కాని దానికి సంబంధించిన అధికారిక సమాచారం ఏదీ బయటకు రాలేదు. ఢిల్లీ నుంచి కూడా ఏపీ గవర్నర్‌ను పిలిచినట్లుగా సంకేతాలు రాలేదు. దీంతో గవర్నర్‌ను ఢిల్లీ పర్యటన అన్నది ఊహాగానమేనని చెబుతున్నారు. సీఎం జగన్‌ గవర్నర్‌తో భేటీ పూర్తయిన తర్వాత… కాసేపటికే ఎమ్మెల్సీలకు ఆమోదముద్ర వేశారు. అసలు ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.. ఎందుకు సీఎం జగన్ వివరణ ఇవ్వగానే ఆమోద ముద్ర వేశారన్నది సస్పెన్స్‌గానే మారింది. ఆ సమయంలోనే గవర్నర్‌ను ఢిల్లీకి పిలిచారనే ప్రచారం ప్రారంభమయింది.

సాధారణంగా బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇక బీజేపీ రాజకీయంగా పోరాటం చేయాలనుకున్న రాష్ట్రాల్లో అయితే.. తామే ముఖ్యమంత్రులం అన్నట్లుగా గవర్నర్లు.. లెఫ్ట్ నెంట్ గవర్నర్లు వ్యవహరిస్తూ ఉంటారు. బెంగాల్ , ఢిల్లీల్లో అదే జరిగుతోంది. అయితే.. బీజేపీతో సన్నిహిత సంబంధాలు నిర్వహిస్తున్న తెలుగు రాష్ట్రాలతో పాటు… ఇతర చోట్ల గవర్నర్లు కాస్త సైలెంట్ గా ఉంటారు. అయితే సైలెంట్‌గా ఉండటం వేరు.. ప్రభుత్వం ఏం చేసినా..సహకరించడం వేరు. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్… రాజ్యాంగ ప్రాథమిక సూత్రాల ఉల్లంఘిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలకు కూడా ఆమోద ముద్ర వేస్తున్నారు. తరవాత కోర్టుల్లో కొట్టి వేసినా దులిపేసుకుంటున్నారు.

ఈ క్రమంలో బిశ్వభూషణ..బీజేపీ నేతల ఆదేశాల కన్నా.. ఎక్కువగా ఏపీ ప్రభుత్వ పెద్దల ఆలోచనలకు అనుగుణంగానే పని చేస్తున్నారన్న అభిప్రాయం.. బలపడింది. ఆయనపై.. ఏపీ బీజేపీ నేతలు.. హైకమాండ్‌కు ఫిర్యాదులు చేసినట్లుగా కూడా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఢిల్లీకి పిలుపంటే.. ఆయనకు క్లాస్ పీకడమో..లేకపోతే.. కొత్త వారిని నియమించే ప్రక్రియకు గ్రౌండ్ వర్క్ చేయడమో అని అనుకున్నారు. కానీ అధికారికంగా ఆయన ఢిల్లీ పర్యటన మాత్రం ఇంత వరకూ ఖరారు కాలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close