తుపాను షెల్టర్లు కూడా అమ్ముతారా : హైకోర్టు

ఆస్తులు అమ్మి అయినా పోలవరంలో విగ్రహాలు.. ఓటు బ్యాంకుకు నగదు బదిలీ పథకాలు అమలు చేసి తీరాల్సిందేనని పట్టుదలగా ఉన్న ఏపీ ప్రభుత్వానికి న్యాయపరమన చిక్కులు చికాకు తెప్పిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఆస్తులు అమ్మడానికి బిల్డ్ ఏపీ పేరుతో తీసుకొచ్చిన పథకంపై పది ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. అయితే తాము ప్రజా ప్రయోజనం కోసమే అమ్ముతున్నామని ప్రభుత్వ లాయర్లు కోర్టుల్లో వాదిస్తున్నా ప్రయోజనం ఉండటం లేదు. అదే సమయంలో… కొన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై వేసిన కౌంటర్లలో ప్రభుత్వం… ప్రస్తుతం ప్రకటించినవే కాకుండా మరికొన్ని విలువైన ఆస్తులను కూడా వేలం వేస్తామని వెల్లడించింది.

వీటిపై జరిగిన విచారణలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ ఏమైనా ఉందా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆస్తులు విక్రయించి నిధులు సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందని ఆరా తీసింది. దేశంలో ఎవరూ చేయని సంక్షేమ కార్యక్రమాలు ఏపీ ప్రభుత్వం చేస్తుందని ప్రభుత్వలాయర్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లి సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తుపాన్ షెల్టర్లను కూడా అమ్మకానికి పెట్టిన విషయాన్ని ఓ పిల్ తరపున వాదించిన న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

తుపాన్ షెల్టర్లను కూడా చివరికి వదలడం లేదా అని హైకోర్టు ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. దాఖలైన అన్ని పిల్‌లపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మార్కెట్లు, క్వార్టర్స్ తో పాటు.. ప్రజలకు ఉపయోగకరమైన వాటిని కూడాప్రభుత్వం అమ్మకానికి పెట్టడం.. చాలా రోజులుగా విమర్శలకు కారణం అవుతోంది. కోర్టు పిటిషన్లు పడటంతో ఇంకా అమ్మకాలు పూర్తి కాలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘విశ్వంభ‌ర‌’లో ప‌వ‌న్‌.. అంత సీన్ ఉందా?

చిరంజీవి న‌టిస్తున్న సోషియో ఫాంట‌సీ చిత్రం 'విశ్వంభ‌ర‌'. వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో త్రిష క‌థానాయిక‌. ఈ చిత్రంలో చిరంజీవి భీమ‌వ‌రం దొర‌బాబుగా, ఐదుగురు చెల్లెమ్మ‌ల‌కు అన్న‌య్య‌గా క‌నిపించ‌నున్నారు. దాదాపు 40...

రివర్స్ ప్రచారం : మేనిఫెస్టో గురించి చెప్పుకోలేని జగన్ !

అధికార పార్టీ నేతగా.. సీఎంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న జగన్ ప్రచారసభల్లో ఏం చెబుతున్నారు ?. మళ్లీ గెలిస్తే ఏం చేస్తానో చెబుతున్నారా ?. తన మేనిఫెస్టో...

కడప లోక్ సభ రివ్యూ : కొంగు సెంటిమెంట్ ఫలిస్తే సంచలనమే !

కడప లోక్ సభ బరిలో " ఎలగైనా అవినాష్ రెడ్డే గెలుస్తారు " అని వైసీపీ నేతలు ధీమాగా చెప్పుకుంటున్నారు. ఎలాగైనా అనే పదం వాడతూ వ్యక్తం చేస్తున్న...

‘స‌లార్ 2’… రెడీ టూ షూట్‌!

ప్ర‌భాస్ మూడ్ మొత్తం సినిమాల‌పైనే ఉంది. ఏమాత్రం గ్యాప్ లేకుండా, షూటింగులు చేసుకొంటూ వెళ్లిపోతున్నాడు. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ 'క‌ల్కి'తో బిజీగా ఉన్న ప్ర‌భాస్‌, ఆ త‌ర‌వాత 'రాజాసాబ్' కు కొన్ని డేట్లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close