పవన్ చెప్పిన ఆడియో టేపులు..! పోలీసుల విచారణ ప్రారంభమయిందా..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన హత్యకు కుట్ర పన్నారంటూ.. సంచలన ఆరోపణలు చేయడమే కాదు… ఆడియో టేపులు కూడా ఉన్నాయని ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ప్రభుత్వం తరపున ఎలాంటి చిన్న పొరపాటు జరగకూడదన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా పవన్ కల్యాణ్‌కు భద్రత పెంచారు. పవన్ కల్యాణ్ ఇంకా ఆ ఆడియో టేపులు ప్రభుత్వానికి కానీ.. పోలీసులు కానీ ఇవ్వకున్నా.. తమ విచారణ మాత్రం ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ విషయంపై స్పందించారు. పవన్‌కు భద్రత పెంచుతామని ప్రకటించారు. పోలీసు వ్యవస్థపై అందరికీ నమ్మకముండాలన్నారు.

అదే సమయంలో పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్… పవన్ తన దగ్గర ఉన్న ఆధారాలు పోలీసులకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆ ముగ్గురెవరో చెప్పాలని, ఆధారాలు ఏమైనా ఉంటే పోలీసులకు తెలియజేయాలన్నారు. తగు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ ఆందోళన కారణంగా ఆయన భద్రతను కూడా పెంచుతున్నట్లు ఎస్పీ ప్రకటించారు. జిల్లాలో పవన్ పర్యటన జరిగినన్ని రోజులు వ్యక్తిగత భద్రతతో పాటు, ఆయన పాల్గొనే కార్యక్రమాలకు అదనపు భద్రత కల్పిస్తామని స్పష్టం చేసారు. ” 2019 ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా తనను హత్య చేసేందుకు ఓ ముగ్గరు కుట్ర పన్నుతున్నారని, ‘ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను చంపితే ఏమవుతుంది. మహా అయితే ఓ నెల రోజులు గొడవలు అవుతాయని ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. వాళ్లు ఏ పార్టీ వారో, ఆ వ్యక్తుల పేర్లు తెలుసు, వారి ముఖాలు కూడా నాకు తెలుసు” అని ఏలూరు బహిరంగ సభలో ప్రకటించారు.

ఆ ముగ్గురు ఎవరో తేల్చాలని.. ఏ పార్టీ వారైనా వదిలి పెట్టకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. హింసా రాజకీయాలకు.. టీడీపీ వ్యతిరేకమని ముఖ్యమంత్రి కూడా పదే పదే చెబుతున్నారు. ఈ విషయంలో అంతర్గతంగా ఇప్పటికే పోలీసు దర్యాప్తు ప్రారంభమైనట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రేపోమాపో ఆ ఆడియో టేపుల కోసం పవన్ కల్యాణ్ వద్దకు పోలీసులు వెళ్లే అవకాశం కూడా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close