కేసీఆర్‌కు అవసరం రాదంటున్నారు కానీ.. మద్దతిస్తారో లేదో చెప్పని అసదుద్దీన్..‍‍!!

తెలంగాణలో హంగ్ వస్తే.. టీఆర్ఎస్ కు మద్దతిస్తానన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పకుండా.. కేసీఆర్ కు పూర్తి మెజార్టీ వస్తుందని.. చెప్పి తప్పించుకున్నారు మజ్లిస్ అధినేత అసదుద్దన్ ఓవైసీ. కేసీఆర్ పూర్తి మెజార్టీతో అధికారంలోకి వస్తారని.. తెలంగాణ ప్రజలంతా ఆయన వెంటే ఉన్నారని తమ మద్దతు అవసరం ఉండదని చెప్పుకొచ్చారు. తాము ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కేసీఆర్ వెంటే ఉంటామన్నారు. హంగ్ ఏర్పడుతుందన్న ప్రచారం.. కాంగ్రెస్ నేతలతో.. అసదుద్దీన్ చర్చలు జరుపుతున్నారన్న పుకార్లు గుప్పుమనడంతో… అసదుద్దీన్ ..మధ్యాహ్నం కేసీఆర్ తో ప్రగతి భవన్ కు వెళ్లి కేసీఆర్ తో సమావేశమయ్యారు. దాదాపుగా రెండు గంటల చర్చల తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. కేసీఆర్ సీఎం అవుతారని… తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు ఒక విషయం చెప్పదల్చుకున్నానని …రేపు రాబోతున్న తీర్పు కేసీఆర్‌కు అనుకూలంగా ఉంటుందని ప్రకటించారు.

టీఆర్ఎస్ కు పూర్తి మెజార్టీ రావాలని అసదుద్దీన్ కోరుకుంటున్నారు. హంగ్ వస్తే.. కేసీఆర్ బీజేపీ మద్దతు తీసుకుంటారన్న ఆందోళన ఆయనలో కనిపించింది. మజ్లిస్ ను వదిలేస్తే.. మద్దతిస్తామని టీఆర్ఎస్ కు బీజేపీ ఇచ్చిన ఆఫర్ పైనా..పరోక్షంగా స్పందించారు. టీఆర్ఎస్ మద్దతు పలుకుతున్నారు కాబట్టి… రేపు హంగ్ వస్తే.. బీజేపీతో కలిసి టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తారా అన్న సందేహాలకు నేరుగానే సమాధానం ఇచ్చారు.

బీజేపీతో కలిసి టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చే అవకాశం ఉండదని తేల్చి చెప్పారు. బీజేపీకి ఇప్పుడున్న సీట్లు కూడా తగ్గిపోతాయని జోస్యం చెప్పారు. ఎంఐఎంకు ఎనిమిది సీట్లు వస్తాయన్నారు. తాను కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నానని వస్తున్న వార్తలను తోసి పుచ్చారు. ఎవరితో టచ్ లో ఉన్నానో చెప్పాలన్నారు.

హైదరాబాద్‌ తన నగరం…హైదరాబాద్‌ ఎంత ప్రశాంతంగా ఉందో నేనే చెప్పగలను ..ఇలాంటి వాతావరణం ఇక ముందుకూడా కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ తో భేటీ కోసం అసదుద్దీన్ బైక్ మీద ప్రగతి భవన్ కు వచ్చారు.. హైదరాబాద్ ఎంతో ప్రశాంతంగా ఉందని చెప్పుకోవడానికి ఆయన ఇలా వచ్చారు. ఇదే మాటను మీడియాకు చెప్పారు. తను బైక్ మీద వచ్చానని.. ఎంత ప్రశాంతంగా హైదరాబాద్ ఉందో అంచనా వేసుకోవాలన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close