కొత్త టైటిళ్ల‌తో కిక్ ఇచ్చారు

శుక్ర‌వారం కొత్త సినిమా క‌బుర్ల‌తో బిజీగా ఉన్న టాలీవుడ్‌కి కొత్త టైటిళ్లు కిక్ ఇచ్చాయి. ఒక్క రోజులోనే రెండు సినిమాల టైటిళ్లు ఫిక్స‌య్యాయి. బాల‌కృష్ణ – పూరి జ‌గ‌న్నాథ్‌ల సినిమా కోసం `పైసా వ‌సూల్‌` అనే టైటిల్ ఖ‌రారు చేశారు. రామ్‌చ‌ర‌ణ్ – సుకుమార్‌ల సినిమా కోసం `రంగస్థలం 1985` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. బాల‌య్య‌, చ‌ర‌ణ్‌ల సినిమాల‌కు సంబంధించిన టైటిళ్ల కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూశారు. ర‌క‌ర‌కాల పేర్లు చ‌ర్చ‌లకొచ్చాయి. బాల‌య్య కోసం జై బాల‌య్య‌, ఉస్తాద్‌, తేడా సింగ్ పేర్లు ప‌రిశీలిస్తున్నార‌ని చెప్పుకొన్నారు. జై బాల‌య్య టైటిల్ దాదాపు ఖ‌రారు అయిపోయింద‌నుకొన్నారు. పైసా వ‌సూల్ అనే పేరు అస‌లు ఎవ‌రూ విన‌లేదు కూడా. చివ‌రి నిమిషంలో ఈ టైటిల్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. దాన్నే బాల‌య్య ఖ‌రారు చేసి షాక్ ఇచ్చాడు.

చ‌ర‌ణ్ సినిమాకీ అంతే. రేప‌ల్లె, ప‌ల్లెటూరి మొన‌గాడు లాంటి పేర్లు ఈ సినిమా కోసం అనుకొన్నారు. రంగస్థలం 1985 అనే టైటిల్ బ‌య‌ట‌కు రాలేదు కూడా. ఆఖ‌రికి ఎవ‌రూ అనుకోని, ఊహించ‌ని టైటిల్ ప్ర‌క‌టించి ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చాడు సుకుమార్‌. ఏదైనా ఓ సినిమా టైటిల్ బ‌య‌ట‌కు వ‌చ్చి, అది కాస్త నోళ్ల‌లో నానితే.. చిత్ర‌బృందం వాటినే ఫిక్స్ చేయాల‌ని చూస్తుంటుంది. అయితే.. ఫ్యాన్స్ ఊహించ‌ని కొత్త టైటిళ్ల‌తో ఆశ్చ‌ర్య‌రిచాయి ఈ రెండు టీమ్ లు. ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ సినిమా టైటిల్ పై కూడా చాలా ఆశ‌లు, అంచ‌నాలు ఉన్నాయి. దేవుడు దిగివ‌స్తే, ఇంజ‌నీర్ బాబు.. పేర్లు ఇప్ప‌టికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు `ప‌ర‌దేశి` వ‌చ్చి చేరింది. మ‌రి.. త్రివిక్ర‌మ్ వీటిలో ఒక‌టి ఖ‌రారు చేస్తాడా? తాను కొత్త టైటిల్ ప్ర‌క‌టించి షాక్ ఇస్తాడా?? చూడాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.