తెలుగు రాష్ట్రాలు రెండింటికీ మొండి చెయ్యే!

హైదరాబాద్: కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఇవాళ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట‌్‍‌లో తెలుగు రాష్ట్రాలకు రెండింటికీ మొండి చెయ్యే చూపించారు. విశాఖ రైల్వే జోన్ అదిగో… ఇదిగో అంటూ టీడీపీ నేతలు కొద్ది రోజులుగా చెప్పుకుంటూ వస్తుండగా, ఇవాళ్టి బడ్జెట్‌లో దాని ప్రస్తావనే లేదు. కోనసీమవాసులకు కూడా కేంద్రం నిరాశను మిగిల్చింది. కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్‌ గురించి కూడా ప్రస్తావించలేదు. ఏపీకి ఒక్క కొత్త రైలుగానీ, ఒక్క లైన్ గానీ ప్రకటించలేదు. తెలుగుదేశం పార్టీ చేసిన అనేక విజ్ఞప్తులను బుట్టదాఖలు చేసినట్లు కనబడుతోంది. అమరావతిలో రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు చేయిస్తానని, అమరావతిని ఏపీలోని అన్ని జిల్లాలకూ కలుపుతూ లైన్ వేయిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినప్పటికీ అవేమీ జరగలేదు. రైల్వే యూనివర్సిటీని గుజరాత్‌లో ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించారు. ఏపీకి దక్కింది చూస్తే, విజయవాడ-నాగపూర్ మధ్య ట్రేడ్ కారిడార్, విజయవాడ-కాజీపేట మధ్య మూడో లైన్ ఏర్పాటు, ఆధ్యాత్మిక రైల్వేస్టేషన్‌గా తిరుపతి స్టేషన్ అభివృద్ధి మాత్రమే కనిపిస్తున్నాయి. కోటిపల్లి-నర్సాపురం లైనుకు రు.200 కోట్లు, పిఠాపురం-కాకినాడ రైల్వేలైన్‌కు రు.50 కోట్లు కేటాయించారు. మరోవైపు తెలంగాణకు కూడా ఇదే పరిస్థితి. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావనే లేదు. యాదగిరిగుట్టవరకు ఎంఎంటీఎస్ పొడిగించాలన్న ప్రతిపాదనను కూాడ పట్టించుకోలేదు. కొత్త రైళ్ళుగానీ, లైన్లుగానీ లేవు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే నిధులతో ఎంఎంటీఎస్ విస్తరణ చేస్తామని మాత్రం రైల్వే మంత్రి చెప్పారు. విభజన హామీలను పట్టించుకోనట్లు స్పష్టంగా కనబడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ నుండి టీఆర్ఎస్…! త్వ‌ర‌లోనే మార్పు

తెలంగాణ కోసం పుట్టిన పార్టీ... తెలంగాణ రాష్ట్రం కోస‌మే ఎగిరిన గులాబీ జెండా.. తెలంగాణ బాగు కోస‌మే తండ్లాట‌... ఇలా త‌మ పార్టీ గురించి కేసీఆర్ ఎంతో గొప్ప‌గా చెప్పుకుంటారు. నిజానికి తెలంగాణ...

ఈసారి మోడీ కష్టమే… బీజేపీకి ఝలక్ ఇచ్చిన ఎంపీ అభ్యర్థి..!!

లోక్ సభ ఎన్నికల్లో 400సీట్లు సాధిస్తామని బీజేపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. బీజేపీ మెజార్టీ సీట్ల గెలుపునకు మోడీ ఛరిష్మా దోహదం చేస్తుందని ప్రకటిస్తున్నారు. దేశమంతా మోడీ వేవ్ ఉందని బలంగా...

బీఆర్ఎస్ లో టెన్షన్ .. బినామీ ఆస్తుల అమ్మకానికి నిర్ణయం..?

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చోటు చేసుకున్న అక్రమాల గుట్టు బయటపడుతుందని బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన నెలకొందా..? భూకబ్జాలకు పాల్పడిన నేతలు ఎలాంటి చిక్కులు రాకుండా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారా..? అంటే అవుననే...

మా రాష్ట్రానికి రండి… రేవంత్ కోసం 7 రాష్ట్రాల రిక్వెస్ట్!

గెల‌వ‌టం అసాధ్య‌మ‌నుకున్న తెలంగాణ‌లో పార్టీని గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డికి... ఇత‌ర రాష్ట్రాల నుండి మా రాష్ట్రానికి రండి అంటూ ఇన్విటేష‌న్లు వ‌స్తున్నాయి. మా రాష్ట్రంలో తెలుగు వారున్నారు మీరు రండి అంటూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close