ఇక తెలంగాణపై బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఆపరేషన్ !?

పంజాబ్ మినహా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంతో తెలంగాణ బీజేపీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. హిందీ బెల్ట్‌లో అజేయ స్థితికి చేరిన బీజేపీ ఇప్పుడు కొరకరాని కొయ్యగా మారిన దక్షిణాదిపై చూసే అవకాశం కనిపిస్తోంది. దక్షిణాదిలో బీజేపీ అధికారం చేపట్టబోయే రెండో రాష్ట్రం తెలంగాణ అని ఆ పార్టీ హైకమాండ్ చాలా నమ్మకంతో ఉంది . ఈ సారి ఎన్నికల్లో గెలిచేది తామేనని.. సర్కార్ ను ఏర్పాటు చేయడం పక్కా అని రాష్ట్ర బీజేపీ నేతలు భావిస్తున్నారు.

ఒక్కొక్క రాష్ట్రంలో పార్టీని విస్తరించుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్న తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకుని అధికారం సాధిస్తే.. ఇతర రాష్ట్రాలకూ విస్తరించవచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలో అమిత్ షా త్వరలో తెలంగాణ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. డబుల్ ఇంజిన్ ఫార్ములాను బీజేపీ నేతలు ప్రధానంగా ప్రయోగించాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే రాష్ట్రాల్లోనూ ఉంటేనే అభివృద్ధి సాధ్యం నినాదంతో ప్రజల్లోకి వెళ్ళాలని భావిస్తున్నారు.

ఇక పూర్తి ఫోకస్ దక్షిణాదిపైనే పెట్టాలని, అందులోనూ తెలంగాణనే టార్గెట్ చేయాలని హైకమాండ్ ప్రణాళికలు చేస్తోంది. బెంగాల్ తరహాలో పార్టీలో చేరికలపై ఇప్పటికే దృష్టి సారించారు. అందుకే టీఆర్ఎస్‌లో ఆదరణ దక్కని సీనియర్ల పేర్లు విస్తృతంగా ప్రచారంలోకి వస్తున్నాయి. త్వరలో తెలంగాణకు జాతీయ నేతలు, కేంద్ర మంత్రుల పర్యటనలు ఉండనున్నాయి. బెంగాల్ తరహా వ్యూహాలను.. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత అమలు చేసే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘పుష్ష‌’పై ఫ‌హ‌ద్‌కు ఇంత చిన్న చూపా?

'పుష్ష' టీమ్ ని ఫ‌హ‌ద్ ఫాజ‌ల్ బాగా ఇబ్బంది పెడుతున్నాడు. త‌న డేట్లు ఇస్తే కానీ 'పుష్ష 2' షూటింగ్ పూర్త‌వ్వ‌దు. ఆయ‌నేమో డేట్లు ఇవ్వ‌డం లేదు. ఇది వ‌ర‌కే ఫ‌హ‌ద్ గంప‌గుత్త‌గా...

మెగా ఫ్యామిలీలో రచ్చ…అల్లు అర్జున్ పై నాగబాబు సీరియస్..!?

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా ప్రచారం చేయడంపై ఇంకా తీవ్ర దుమారం రేగుతోంది. ఇప్పటికే ఆయన పర్యటన...

వ‌ర‌ల్డ్ క‌ప్ ముందు ఇది అవ‌స‌ర‌మా అధ్య‌క్షా..?!

ఏ ఆటైనా మైదానంలో జ‌ట్టు స‌భ్యులంతా స‌మ‌ష్టిగా ఆడితేనే అందం, విజ‌యం. ఒక‌రిపై మ‌రొక‌రు క‌స్సుబుస్సులాడుతుంటే, క‌య్యానికి కాలుదువ్వుతుంటే, అస‌లు జ‌ట్టు స‌భ్యుల మ‌ధ్య స‌యోధ్య లేక‌పోతే - ప్ర‌త్య‌ర్థుల‌పై ఎలా త‌ల‌ప‌డ‌తారు?...

విజ‌య్ స‌ర‌స‌న సాయి ప‌ల్ల‌వి?

టాలీవుడ్ లో ఓ కొత్త కాంబోకి తెర లేవ‌నుందా? విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సాయి ప‌ల్ల‌వి క‌లిసి న‌టించ‌బోతున్నారా? ఆ అవ‌కాశాలు ఉన్నట్టే క‌నిపిస్తోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా దిల్ రాజు బ్యాన‌ర్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close