బీజేపీకి రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే గుడ్ బై..?

ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్లో ఒకరైన అకుల సత్యనారాయణ పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఆయన రాజీనామా లేఖను బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ప్రత్యక్షం అయిన ఆయన… రాజీనామా విషయంలో గుంభనంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. బీజేపీ వర్గాలు మాత్రం.. ఆకుల సత్యనారాయణ రాజీనామా చేశారని చెబుతున్నారు. ఆకుల సత్యనారాయణ కొద్ది రోజులుగా జనసేన పార్టీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన భార్య ఇప్పటికే జనసేన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బీజేపీ నుంచి పోటీ చేస్తే డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో.. ఆయన జనసేన నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.

భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది. టీడీపీ పదమూడు అసెంబ్లీ సీట్లు కేటాయిస్తే.. అందులో నాలుగు చోట్ల మాత్రం విజయం సాధించారు. రాజమండ్రి అర్బన్, తాడేపల్లిగూడెం,కైకలూరు, విశాఖ ఉత్తర స్థానాల నుంచి ఎమ్మెల్యేలుగా బీజేపీ నేతలు గెలిచారు. వీరిలో ఇప్పుడు.. ముగ్గురు పక్క చూపులు చూస్తున్నారు. తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే మాణిక్యాల రావు మాత్రమే బీజేపీలో గట్టిగా ఉంటారని చెబుతున్నారు. ఆకల సత్యనారాయణ గుడ్ బై చెప్పేశారు. ఇక కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన పోటీ చేయబోవడం లేదని ప్రకటించారు. అలాగే విష్ణుకుమార్ రాజు కూడా టీడీపీ వైపు చూస్తున్నారని చెబుతున్నారు.

భారతీయ జనతా పార్టీకి వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకడం కష్టంగా మారింది. ఆ పార్టీకి చెందిన అగ్రనేతలుగా చెలామణి అవుతున్న వారెవరూ.. పోటీకి సిద్ధపడటం లేదు. అదే సమయంలో.. పార్టీలో గ్రూపు తగాదాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఒక నేతంటే.. మరో నేతకు సరి పడని పరిస్థితి ఉంది. నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, విశాఖ ఎంపీ హరిబాబు కూడా.. ఇటీవలి కాలంలో.. పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. తాము ఈ సారి పోటీ చేయబోవడం లేదని.. వారు తమ సన్నిహితులకు చెబుతున్నారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఏపీ బీజేపీకి.. మరిన్ని ఇబ్బందికర పరిణామాలు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close