ఫోన్ ట్యాపింగ్‌పై గట్టిగా పట్టుకుంటున్న బీజేపీ !

తమ ఫోన్లను ట్యాప్ చేశారని బీజేపీ హైకమాండ్ పెద్దలు గట్టిగా భావిస్తున్నారు. మునుగోడు ఉపఎన్నికల హడావుడి పూర్తయిన వెంటనే.. ఈ కేసు విషయంలో పెద్ద ఎత్తున రచ్చ చేయడానికి బీజేపీ పెద్ద ప్లానే వేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే రెండు సార్లు బీజేపీ పెద్దలు ఈసీని కలిసి .. తెలంగాణ సర్కార్ తమ ఫోన్లను ట్యాప్ చేస్తోందని .. విచారణ చేయించాలని ఫిర్యాదు చేశారు. ఇలా ఫిర్యాదు చేసిన వారిలో తరుణ్ చుగ్ లాంటి పెద్ద నేతలే ఉన్నారు. మరో వైపు ఓ బీజేపీ సానుభూతిపరుడు హైకోర్టులో కేసు విషయంలో ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. నాలుగో తేదీన విాచరణ జరుపుతామని తెలిపింది.

ఫోన్ ట్యాపింగ్‌పై పూర్తి సమాచారం బీజేపీ పెద్దలు సేకరించారని.. ఈ విషయంలో కేసీఆర్ వ్యవహారం మొత్తం బయట పెట్టాలనుకుంటున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్ ఫ్రా కంపెనీ బ్యాంక్ అకౌంట్లను టీఆర్ఎస్ నేతలు యాక్సెస్ చేశారు.త ఎవరెవరికి డబ్బులు పంపారో లెక్క తీశారు. ఇది బయటకు ఎలా తెలిసిందని ఆరా తీస్తున్నారు. ఇది కూడా ట్యాపింగ్ తరహాలో ట్రాక్ చేశారని ఆరోపిస్తున్నారు. వీటన్నింటినీ బయటకు తీసి.. కేీసఆర్ గుట్టు బయటపెడతామని అంటున్నారు. మరో వైపు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో టీఆర్ఎస్ పూర్తిగా సైలెంట్ అయిపోయింది.

దర్యాప్తు కూడా పెద్దగా జరగడంలేదు. ఆ ఫోన్లను ట్యాప్ చేయలేదని వాదించేలా… తానే రికార్డు చేశానని నందు అనే వ్యక్తితో స్టేట్ మెంట్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా గతంలో రేవంత్ రెడ్డి ఇష్యూని ట్రాప్ చేసినప్పుడు .. ట్యాపింగ్ ఇష్యూలో తెలంగాణ సర్కార్ ఇరుక్కోలేదు..కానీ ఈ సారి కేంద్ర ప్రభుత్వ పెద్దలనే టార్గెట్ చేయడంతో వారుఈ విషయాన్ని వదిలే చాన్స్ లేదని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

సీఎస్, డీజీపీ బదిలి ఇంకెప్పుడు !?

ఏపీలో వ్యవహారాలన్నీ గీత దాటిపోతున్నాయి. ఎన్నికలకోడ్ ఉన్నా.. రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతోంది. ఐపీసీ సెక్షన్ల కాకుండా జేపీసీ సెక్షన్లతో పోలీసులు రాజకీయ కేసులు పెట్టేస్తున్నారు. అమాయకుల్ని బలి చేస్తున్నారు. మరో...

ఎక్స్ క్లూజీవ్: మారుతి నుంచి ‘బేబీ’లాంటి ‘బ్యూటీ’

గ‌తేడాది వ‌చ్చిన సూప‌ర్ హిట్ల‌లో 'బేబీ' ఒక‌టి. చిన్న సినిమాగా వ‌చ్చి, సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకొంది. నిర్మాత‌ల‌కు, పంపిణీదారుల‌కూ విప‌రీత‌మైన లాభాల్ని పంచిపెట్టింది. ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close