ట్యాపింగ్ కేసూ సీబీఐకే ఇవ్వాలంటున్న బీజేపీ !

రాజకీయంగా సున్నితమైన కేసులన్నింటినీ సీబీఐకే ఇవ్వాలని తెలంగాణ బీజేపీ డిమాండ్ చేస్తోంది. కాళేశ్వరం విషయంలో ఇప్పటికే ఇలాంటి డిమాండ్లు చాలా సార్లు చేసింది. అయితే బీఆర్ఎస్ జుట్టు తమకు అందిందని.. అది బీజేపీ చేతికి ఎందుకు ఇస్తామని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ బీఆర్ఎస్ పెద్దలు నిండా మునిగిపోయారన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. గవర్నర్‌కు కూడా విజ్ఞప్తి చేశారు.

అయితే రాష్ట్ర పరిధిలోని అంశాలపై విచారణకు ఆదేశించే అధికారం గవర్నర్‌కు ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు కావాలని సిఫారసు చేస్తే చేయవచ్చు. లేదా కోర్టు ఆదేశిస్తే సీబీఐ విచారణ జరిగే అవకాశం ఉంటుంది. కాళేశ్వరంపై సీబీఐ విచారణ కావాలని బీజేపీ సానుభూతిపరుడు కోర్టుకు వెళ్తే అనుకూల ఫలితం రాలేదు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని గవర్నర్ ద్వారా ప్రయత్నిస్తున్నారు.

ఫోన్ ట్యాపింగ్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో ఎమ్మెల్యేల కొనుగోలు అంశం కూడా తెరపైకి వచ్చింది. బీఎల్ సంతోష్ ఫోన్ ని కూడా ట్యాప్ చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ .. ఈ కేసు తమ చేతికి వస్తేనే మంచిదని భావిస్తోంది. అందుకే గవర్నర్ ద్వారా ప్రయత్నిస్తోంది. రేపు బీజేపీ సానుభూతిపరులు కోర్టుకు వెళ్లినా ఆశ్చర్యం లేదని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్ గూటికి శ్రీకాంతా చారి తల్లి… ఎమ్మెల్సీ ఖాయమా..?

తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ , మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి ఆమెను...

పవన్ కళ్యాణ్ వెంటే బన్నీ

జనసేనాని పవన్ కళ్యాణ్ కు హీరో అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. పవన్ ఎంచుకున్న మార్గం తనకు గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు....

బ్ర‌హ్మానందం…. ఇదే చివ‌రి ఛాన్స్!

బ్ర‌హ్మానందం త‌న‌యుడు గౌత‌మ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఏకంగా 20 ఏళ్ల‌య్యింది. 2004లో 'ప‌ల్ల‌కిలో పెళ్లి కూతురు' విడుద‌లైంది. అప్ప‌టి నుంచీ... బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. మ‌ధ్య‌లో 'బ‌సంతి' కాస్త...

లోక్ సభ ఎన్నికలు : తెలంగాణలో ఏ పార్టీ ఎన్ని సీట్లను సాధిస్తుంది..?

లోక్ సభ సీట్లపై ఎవరి లెక్కలు వారివే. 14సీట్లు సాధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటే,తాము డబుల్ డిజిట్ స్థానాలను దక్కిచుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.బీఆర్ఎస్ కూడా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close