జగన్‌ బెయిల్ రద్దు పిటిషన్‌పై మళ్లీ వాయిదా కోరిన సీబీఐ..!

వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వచ్చే నెల ఒకటో తేదీకి వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేయడానికి వరుసగా మూడో సారి కూడా సీబీఐతో పాటు జగన్ కూడా… వాయిదా కోరారు. రెండు వర్గాలు కూడబలుక్కున్నట్లుగా పదే పదే వాయిదాలు కోరడంపై న్యాయనిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి గత వాయిదాలో సీబీఐ కోర్టు చాలా సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చింది. ఇదే చివరి అవకాశమని.. ఎట్టి పరిస్థితుల్లోనూ స్పష్టం చేసింది. అయినప్పటికీ సీబీఐ కోర్టు న్యాయమూర్తి హచ్చరికలను లైట్ తీసుకున్న న్యాయమూర్తులు లాక్ డౌన్ కారణంగా కౌంటర్ దాఖలు చేయలేకపోతున్నామంటూ చెప్పుకొచ్చారు.

న్యాయమూర్తి మరోసారి ఇదే చివరి అవకాశమని అటు సీబీఐతో పాటు ఇటు జగన్ తరపు లాయర్లకు తేల్చి చెప్పారు. ఈ సారి కౌంటర్ దాఖలు చేయకపోతే.. విచారణ ప్రారంభిస్తామని ప్రకటించారు. లాక్ డౌన్ అనేది కారణమేనని.. కౌంటర్ రెడీగా ఉంటే ఈ మెయిల్ చేయవచ్చునని రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది వాదించారు. అయితే వారి వైపు నుంచి స్పందన లేదు. సీబీఐ కూడా అదే పనిగా ఎందుకు వాయిదా కోరుతున్నారో అర్థం కావడం లేదని.. రఘురామ తరపు న్యాయవాది అసహనం వ్యక్తం చేశారు. ఇలా వాయిదాలు కోరుతూ… తమ క్లయింట్‌ను హింసిస్తున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

సీబీఐ కొత్త చీఫ్‌గా జైస్వాల్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఆర్థిక నేరస్తుల పట్ల ఆయన చాలా కఠినంగా ఉంటారన్న ప్రచారం ఉంది. స్టాంపుల కుంభకోణంలో తెల్గీని జైలుపాలు చేసిన ఘనత ఆయనదే. ఇప్పుడు..సీబీఐలో చురుకుదనం ప్రారంభమయ్యే చాన్స్ ఉందని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ భవిష్యత్ ఎక్కువగా సీబీఐ కౌంటర్ మీదే ఆధారపడి ఉంది. జగన్ బెయిల్ షరుతులు ఉల్లంఘించారని సీబీఐ స్పష్టం చేస్తే కేసుకు బ0లం పెరుగుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close