24న మరోసారి సీబీఐ ముందుకు అవినాష్ రెడ్డి !

వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24వ తేదీన హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. ఈ నోటీసుల్ని వాట్సాప్‌లో పంపారు. గత నెల 28న అవినాష్ రెడ్డిని తొలి సారిగా ప్రశ్నించారు. ఆ సమయంలో ఆయన కాల్ లిస్ట్ తో ప్రశ్నలు వేయడంతో తెల్లవారుజామున మూడు గంటల సమయంలో జగన్ పీఏ కృష్ణమోహన్ రెడ్డి, భారతి పీఏ నవీన్ లతో మాట్లాడినట్లుగా తేలింది. దీన్ని అవినాష్ రెడ్డి కూడా అంగీకిరంచడంతో వారిదర్నీ ప్రశ్నించారు సీబీఐ అధికారులు.

అయితే ఫోన్లు వారికే చిసనప్పటికీ మాట్లాడింది మాత్రం జగన్, భారతిలేనని సహంజగా ఎవరికైనా డౌట్ వస్తుంది. సీబీఐ అధికారులు కూడా ఈ విషయాన్ని నిర్ధారణ చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో అవినాష్ రెడ్డి విచారణకు హాజరైనప్పుడు సీబీఐ అధికారులపైనే ఆరోపణలు చేస్తున్నట్లుగా మాట్లాడారు. అయితే ఇలాంటి వి వారు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. అవినాష్ రెడ్డి అడిగిన పలు సౌకర్యాలు కూడా కల్పించడానికి నిరాకరించారు. మరోసారి పిలవకపోవచ్చని అవినాష్ రెడ్డి అప్పట్లో చెప్పారు.కానీ నెలలోపే మరోసారి పిలుస్తున్నారు.

ఈ కేసులో అన్ని వేళ్లూ ప్రధానంగా అవినాష్ రెడ్డి వైపు చూపిస్తున్నారు. అందుకే ఆయనకు సీబీఐ నోటీసులు జారీ చేయడం ఎప్పటికప్పుడు సంచలనం అవుతోంది. గతంలో నోటీసులు ఇచ్చినప్పుడు సీఎం జగన్ మూడు రోజుల పాటు అన్ని పర్యటనలకు క్యాన్సిల్ చేసుకుని క్యాంప్ ఆఫీస్ కే పరిమితమయ్యారు. ఈ సారి జగన్ ఎలాంటి ప్రయత్నాలు అయినా చేస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close