వ్యాక్సిన్ల తప్పు రాష్ట్రాలదేనని కేంద్రం లెక్కలు..!

బీజేపీయేతర రాష్ట్రాలన్నీ కేంద్ర వ్యాక్సిన్లు ఇవ్వడం లేదని.. ఆరోపిస్తున్నాయి. ఒకరికొకరు లేఖలు రాసుకుంటున్నారు. కలసికట్టుగా పోరాటం చేద్దామని.. పిలుపునిచ్చుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో కేంద్రం.. ఆయా రాష్ట్రాలన్నీ.. వ్యాక్సిన్ విషయంలో ఎంత తేలికగా ఉన్నాయో చెబుతూ.. ఓ ఫ్యాక్ట్ షీట్ విడుదల చేసింది. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వివరాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌కు జనవరి నుంచి మార్చి వరకు 3 నెలల్లో 65 లక్షల యాభై వేల వ్యాక్సిన్ డోసులు పంపారు. అయితే.. ఈ మూడు నెలల్లో ఏపీ సర్కార్ ప్రజలకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ కేవలం.. 26 లక్షల 10వేల డోసులు మాత్రమే.

అంటే.. దాదాపుగా నలభై లక్షల డోసులు ఏపీ సర్కార్.. నిల్వ చేసుకుంది. ఆ సమయంలో డోసుల వేస్టేజీ కూడా ఎక్కువగానే ఉంది. తెలంగాణ కూడా ఈ విషయంలో తక్కువేమీ చేయలేదు. తెలంగాణకు కేంద్రం 41 లక్షల 40వేల డోసులు పంపిస్తే.. మూడు నెలల్లో 13 లక్షల డోసులు మాత్రమే పంపిణీ చేశారు. రెండు లక్షల ఇరవై ఐదు వేల డోసులు వృధా చేశారని.. కేంద్రం తన ఫ్యాక్ట్ షీట్‌లో వెల్లడించింది. తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు..బీజేపీయేతర రాష్ట్రాలన్నీ.. అంతేనని కేంద్రం ఆరోపిస్తోంది. పంపిణీ చేసిన వ్యాక్సిన్లలో సగం కూడా వాడలేదని అంటోంది. కేంద్రం విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్‌లో బీజేపీయేతర ప్రభుత్వాలు మాత్రమే ఉన్న రాష్ట్రాల గురించి ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎంత చురుగ్గా వ్యాక్సినేషన్ నిర్వహించాయో.. ఫ్యాక్ట్ షీట్‌లో కేంద్రం వివరాలు బయటపెట్టలేదు.

నిజానికి కేంద్రం చాలా వివరాలు దాచి పెట్టిందని.. రాష్ట్రాలు మండిపడే అవకాశాలుఉన్నాయి. ఎందుకంటే.. సెకండ్ వేవ్ ప్రారంభమైన తర్వాతనే వ్యాక్సినేషన్ ఊపందుకుంది. అప్పటి వరకూ ప్రజలు.. ప్రభుత్వాలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. వ్యాక్సిన్‌పై వ్యతిరేక ప్రచారం జరగడంతో.. చాలా మంది మిన్నకుండిపోయారు. ప్రభుత్వాలు కూడా ఒత్తిడి చేయలేదు. సెకండ్ వేవ్ ప్రారంభమైన తర్వాత అంటే.. ఏప్రిల్, మే నెలలో వ్యాక్సిన్ అవసరం విపరీతంగా పెరిగింది. కానీ కేంద్రం ఈ రెండు నెలల గురించిన సమాచారాన్ని చెప్పలేదు. మార్చి వరకూ చెప్పి.. తప్పు అంతా రాష్ట్రాలదేనని ఫ్యాక్ట్ షీట్ పేరుతో ఆరోపించడం ప్రారంభించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close